ETV Bharat / state

కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధ్వజారోహణ

author img

By

Published : Mar 23, 2021, 6:43 PM IST

అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించారు.

kadiri lakshmi narasimha swamy brahmotsavam
కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధ్వజారోహణ

అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజులపాటు కన్నులపండువగా జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇవాళ మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ధ్వజానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం, అలాగే ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు చిహ్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:

అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజులపాటు కన్నులపండువగా జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇవాళ మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ధ్వజానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం, అలాగే ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు చిహ్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. పట్టించిన సీసీ కెమెరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.