ETV Bharat / state

అనంతపురంలో ఇసుక కోసం ధర్నా

ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

author img

By

Published : Jul 15, 2019, 3:38 PM IST

రోడ్డుపై బైఠాయించి ధర్నాచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రభుత్వం ఇసుక తరలింపుపై నిషేధం విధించడం వల్ల వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ మడకశిరలోని ప్రధాన రహదారిపై భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. తహశీల్దార్ వచ్చి ఇసుక తరలించుకోవడానికి అనుమతి ఇచ్చే వరకూ వెళ్లేది లేదని పట్టుపట్టి కుర్చున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, సామాన్యులు ఇళ్లు నిలిచిపోయాయని దాదాపు పది వేల మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర తహశీల్దార్ హరినాథ్ రావు వచ్చి ఇసుక తరలింపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడంతో ధర్నా విరమించారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నాచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ఇదీ చూడండి కర్ణాటకీయం: బలపరీక్ష సవాలులో గెలుపెవరిది?

ప్రభుత్వం ఇసుక తరలింపుపై నిషేధం విధించడం వల్ల వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ మడకశిరలోని ప్రధాన రహదారిపై భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. తహశీల్దార్ వచ్చి ఇసుక తరలించుకోవడానికి అనుమతి ఇచ్చే వరకూ వెళ్లేది లేదని పట్టుపట్టి కుర్చున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, సామాన్యులు ఇళ్లు నిలిచిపోయాయని దాదాపు పది వేల మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర తహశీల్దార్ హరినాథ్ రావు వచ్చి ఇసుక తరలింపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడంతో ధర్నా విరమించారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నాచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ఇదీ చూడండి కర్ణాటకీయం: బలపరీక్ష సవాలులో గెలుపెవరిది?

Intro:ap_gnt_81_14_kodela_meediyaa_samaavesam_avb_ap10170

బడ్జెట్ లో ముఖ్య అంశాలు లేవు.కోడెల

వైసీపీ ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో చాలా ముఖ్య అంశాలు లేవని మాజీ సభాపతి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి లేదు, చంద్రన్న భీమా లేదు, ఇసుక సమస్య పరిస్కారం లేదు, రాజధాని నిర్మాణం లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 43వేల కోట్లు ఆర్ధిక లోటు ఉంది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు అని ప్రశ్నించారు.




Body:ఈ సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఇరు పార్టీ లు చర్చిస్తుంటే మీ పార్టీ లో 23 మందే ఉన్నారు అని స్వయంగా ముఖ్యమంత్రే అవహేళనగా మాట్లాడటం సరి కాదని కోడెల అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు నిండకుండానే 400 మంది తెదేపా నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. వైసీపీ నాయకులే కొట్టి తిరిగి వాళ్లే కేసులు పెడుతున్నారని, తన్నులు తిన్న తెదేపా నాయకులు జైలుకి వెళ్తున్న ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నేర చరిత్ర జీరోగా వుందని కోడెల గుర్తుచేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం చూపించలేక పోతున్నారని తెలిపారు. దీనితో పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని అన్నారు.


Conclusion:రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. ఆ దౌర్జన్యాలలో నేనూ ఒక బాధితుడినేనని తెలిపారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో మాకుటుంభంపై కొందరు మాపై సాక్షాలు లేని కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై పోలీసులను అడిగితే వాళ్లే వచ్చి ఫిర్యాదులు ఇస్తే తీసుకోవాలి కదా అని అంటున్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రిత్వ శాఖల్లో పని చేసిన అనుభవం ఉన్న నాకు చట్టం గురించి పోలీసులు చెప్పడం విడ్డురంగా వుందన్నారు. కేసు పెట్టిన వారు ఎటువంటి సాక్షం చూపలేక పోతే తిరిగి వారిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టె చట్టం కూడా ఉందని గుర్తు చేశారు. మరి వారిపై కూడా కేసు పెడతారా అని ప్రశ్నించారు.వైకాపా ముసుగులో అసాంఘిక శక్తులు దాడులు చేస్తారని ప్రజలకు భయంగా ఉందన్నారు. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో బాధ్యతను ఇస్తే మనం వారికి అభివృద్ధిని అందించాలే తప్ప వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. నా ఇంటి ముందు ఎమ్మెల్యే ప్రోస్తాహంతో ధర్నా చేసిన వ్యక్తి గత చరిత్రను చూడాలని తెలిపారు. ప్రతి సంఘటనను ప్రజలు గమనిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని అన్నారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.