ETV Bharat / state

'మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది'

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో మైనార్టీల ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్​ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

author img

By

Published : Jan 26, 2020, 2:57 PM IST

deputy cm amjad basha participates in ysrcp minority programme at anathapur
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది: అంజద్ బాషా
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతిగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జరిగిన మైనార్టీ ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడు నెలల కాలంలోనే 80 శాతం పూర్తి చేశామని అన్నారు. మూడు పంటలు పండే చోట రాజధానిని నిర్మించి అమరావతి ప్రాంత ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతిగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జరిగిన మైనార్టీ ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడు నెలల కాలంలోనే 80 శాతం పూర్తి చేశామని అన్నారు. మూడు పంటలు పండే చోట రాజధానిని నిర్మించి అమరావతి ప్రాంత ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

ఇదీ చదవండి:

కదిరిలో ఐకాస నేతల వినూత్న నిరసన

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

* మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది *

మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు.

శనివారం ఉరవకొండ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మైనారిటీ ఆత్మీయసభలో ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీల పక్షపాతిగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడు నెలల కాలంలో 80 శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మూడు పంటలు పండే చోట రాజధానిని నిర్మించారని అమరావతి ప్రాంత ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని వారన్నారు.

నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనది అని తెలిపారు. రాష్ట్ర కుల మత వర్గాలకు అతీతంగా జగనన్న అమ్మ ఒడి రాష్ట్రంలోని 43 లక్షల మంది తల్లులకు 6450 కోట్ల రూపాయలను అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చేసిన తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో అనేక మంది తల్లులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులను కలుసుకుని మాట్లాడారని, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఎక్కువ మంది పిల్లలు మధ్యలోనే బడి మనేసరని తెలిపారు.


Body:బైట్ 1 : విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే.
బైట్ 2 : తలారి రంగయ్య, అనంతపురం యం.పీ
బైట్ 3 : అంజాద్ బాషా, ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 25-01-2020
sluge : ap_atp_71_25_ysrcp_minority_program_avb_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.