ETV Bharat / state

రైల్వే గేటు వద్ద వ్యక్తి మృతదేహం..మృతిపై అనుమానాలు

కోటిపి గ్రామ సమీపంలోని పొలాల్లో రమేష్​ బాబు(35) అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. మృతుడు వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల బెంగళూరులో నివసిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గురువారం రైల్వేగేటు వద్ద కాలిన గాయాలతో ఆయన మృతదేహాన్ని గుర్తింారు

author img

By

Published : Jul 17, 2020, 5:41 PM IST

dead body found in kotipi railway gate in ananthapur district
టిపి రైల్వేగేటు వద్ద మృతదేహం

అనంతపురం గ్రామీణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కోటిపి వద్ద గురువారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గోళ్లాపురం గ్రామానికి చెందిన రమేష్​ బాబు(35) వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. గురువారం కోటిపి రైల్వేగేటు వద్ద ఆయన మృతదేహాన్ని కాలిన గాయాలతో గుర్తించారు. బుధవారం గోళ్లాపురం గ్రామస్థులతో రమేష్​బాబు, ఆయన భార్య మాట్లాడినట్లు సమాచారం. ఎవరైనా తీసుకొచ్చి పెట్రోల్​ పోసి నిప్పుపెట్టారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి :

అనంతపురం గ్రామీణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కోటిపి వద్ద గురువారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గోళ్లాపురం గ్రామానికి చెందిన రమేష్​ బాబు(35) వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. గురువారం కోటిపి రైల్వేగేటు వద్ద ఆయన మృతదేహాన్ని కాలిన గాయాలతో గుర్తించారు. బుధవారం గోళ్లాపురం గ్రామస్థులతో రమేష్​బాబు, ఆయన భార్య మాట్లాడినట్లు సమాచారం. ఎవరైనా తీసుకొచ్చి పెట్రోల్​ పోసి నిప్పుపెట్టారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి :

కరోనా పాజిటీవ్​ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.