ETV Bharat / state

'కొవిడ్​ బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Apr 19, 2021, 8:49 PM IST

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బత్తలపల్లి మండలం ఆర్డీటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన కొవిడ్​ కేర్​ సెంటర్​ను ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు.

covid care center in bathalapalli
బత్తలపల్లిలో కొవిడ్​కేర్​ సెంటర్​ ప్రారంభం

కొవిడ్ చికిత్స కోసం జిల్లాలోని బత్తలపల్లి మండలం ఆర్డీటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆర్డీటీ​ హాస్పిటల్​ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నెఫెర్రర్​తో కలిసి జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు ప్రారంభించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అందరికీ అందుబాటులో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కరోనాపై ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఆసుపత్రి డైరెక్టర్ మంచు ఫెర్రర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్ చికిత్స కోసం జిల్లాలోని బత్తలపల్లి మండలం ఆర్డీటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆర్డీటీ​ హాస్పిటల్​ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నెఫెర్రర్​తో కలిసి జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు ప్రారంభించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అందరికీ అందుబాటులో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కరోనాపై ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఆసుపత్రి డైరెక్టర్ మంచు ఫెర్రర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.