ETV Bharat / state

ఆ లారీలు అమ్మారని జేసీ ప్రభాకర్​ రెడ్డిపై కేసు

author img

By

Published : Jun 6, 2020, 6:15 PM IST

బీఎస్​ 3 ఇంజిన్లు కలిగిన వాహనాలను బీఎస్​ 4గా మార్చి అమ్మారని జేసీ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్​ ఇంటి ముందు లారీ యజమానులు ధర్నాకు దిగారు. తమ వాహనాలను రవాణా అధికారులు జప్తు చేశారని, జేసీ ట్రావెల్స్​ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. చివరకు చేసేదేంలేక నిరసనకు దిగామన్నారు. నిరసన చేస్తున్న లారీ యజమానులను తాడిపత్రి పోలీసులు స్టేషన్​కు తరలించి విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్, జేసీ ట్రావెల్స్​పై కేసులు నమోదుచేశారు.

ఆ లారీలు అమ్మారని.. జేసీ ప్రభాకర్​ రెడ్డిపై కేసు
ఆ లారీలు అమ్మారని.. జేసీ ప్రభాకర్​ రెడ్డిపై కేసు

తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానులు నిరసన చేపట్టారు. జేసీ ట్రావెల్స్​లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారని.. ఆ వాహనాలను రవాణా శాఖ జప్తు చేసిందని ఆరోపించారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లారీలు జప్తుచేయడంతో పాటు తమపై కేసులు కూడా నమోదుచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానుల ధర్నా
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానుల ధర్నా

తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ జేసీ ప్రభాకర్​ ఇంటి ముందు బైఠాయించారు. పట్టణ సీఐ తేజమూర్తి బాధితులను పోలీసు స్టేషన్​కి తరలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు, ఎంవీఐ రమణా రెడ్డి బాధితులను విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జేసీ. ట్రావెల్స్ యజమాని జేసీ. ప్రభాకర్​రెడ్డితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు.

రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

జరిగిందేంటి?

జేసీ. ట్రావెల్స్ ద్వారా దాదాపు 150 టిప్పర్లు, లారీలను తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో రూ.18 కోట్లకు విక్రయించారు. రవాణా శాఖ అధికారులు దర్యాప్తులో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా మార్పు చేశారని గుర్తించి వాహనాలను జప్తు చేశారు. దీంతో లారీ యజమానులు ఆందోళనకు గురై లారీల అమ్మకంలో మధ్యవర్తిగా ఉన్న నాగేశ్వర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాగేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని జేసీ. ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. చివరకు లారీ యజమానులు, నాగేశ్వర్ రెడ్డి అంతా కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదట నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి : స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు

తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానులు నిరసన చేపట్టారు. జేసీ ట్రావెల్స్​లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారని.. ఆ వాహనాలను రవాణా శాఖ జప్తు చేసిందని ఆరోపించారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లారీలు జప్తుచేయడంతో పాటు తమపై కేసులు కూడా నమోదుచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానుల ధర్నా
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానుల ధర్నా

తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ జేసీ ప్రభాకర్​ ఇంటి ముందు బైఠాయించారు. పట్టణ సీఐ తేజమూర్తి బాధితులను పోలీసు స్టేషన్​కి తరలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు, ఎంవీఐ రమణా రెడ్డి బాధితులను విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జేసీ. ట్రావెల్స్ యజమాని జేసీ. ప్రభాకర్​రెడ్డితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు.

రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

జరిగిందేంటి?

జేసీ. ట్రావెల్స్ ద్వారా దాదాపు 150 టిప్పర్లు, లారీలను తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో రూ.18 కోట్లకు విక్రయించారు. రవాణా శాఖ అధికారులు దర్యాప్తులో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా మార్పు చేశారని గుర్తించి వాహనాలను జప్తు చేశారు. దీంతో లారీ యజమానులు ఆందోళనకు గురై లారీల అమ్మకంలో మధ్యవర్తిగా ఉన్న నాగేశ్వర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాగేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని జేసీ. ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. చివరకు లారీ యజమానులు, నాగేశ్వర్ రెడ్డి అంతా కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదట నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి : స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.