ETV Bharat / state

రైతుపై ఎలుగుబంటి దాడి - కుందుర్పిలో ఎలుగు దాడి

అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. ఉదయం వేళ రైతు పొలం పనులకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.

Bear attack on farmer at ananthapur kudhurpi
రైతుపై ఎలుగుబంటి దాడి
author img

By

Published : Nov 23, 2020, 10:41 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. హనుమంతప్ప అనే రైతు ఉదయం పొలం పనులకు వెళ్తుండగా.. ఎలుగుబంటి, తన మూడు పిల్లలతో కలిసి దాడి చేసినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు గట్టిగా హారన్‌ కొట్టడంతో ఎలుగులు వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన హనుమంతప్పను ప్రథమ చికిత్స అనంతరం.. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. హనుమంతప్ప అనే రైతు ఉదయం పొలం పనులకు వెళ్తుండగా.. ఎలుగుబంటి, తన మూడు పిల్లలతో కలిసి దాడి చేసినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు గట్టిగా హారన్‌ కొట్టడంతో ఎలుగులు వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన హనుమంతప్పను ప్రథమ చికిత్స అనంతరం.. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.