ETV Bharat / state

సొంత ఖర్చుతో పేదల ఇళ్ల నిర్మాణ పూర్తి చేస్తాం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

తెలుగుదేశం హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే.. తామే పెండింగ్‌ పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు ఇంటి స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు.

author img

By

Published : Jan 8, 2021, 3:21 PM IST

bala krishna comments on tidco house construction
హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

తెలుగుదేశం హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే.. తామే పెండింగ్‌ పనులు పూర్తిచేసి గృహప్రవేశం చేయిస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం కొట్టిపి రోడ్డులో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను బాలకృష్ణ పరిశీలించారు. లబ్ధిదారులతో కలిసి 'నా ఇల్లు-నా సొంతం' అంటూ నినదించారు. గత ప్రభుత్వం రెండు సెంట్లలో పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే.. వైకాపా ప్రభుత్వం అనువుగాని చోట ఒక్క సెంటు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని దుయ్యబట్టారు. అర్ధాంతరంగా ఇళ్ల నిర్మాణం ఆపేసి పేదలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.

హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

తెలుగుదేశం హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే.. తామే పెండింగ్‌ పనులు పూర్తిచేసి గృహప్రవేశం చేయిస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం కొట్టిపి రోడ్డులో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను బాలకృష్ణ పరిశీలించారు. లబ్ధిదారులతో కలిసి 'నా ఇల్లు-నా సొంతం' అంటూ నినదించారు. గత ప్రభుత్వం రెండు సెంట్లలో పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే.. వైకాపా ప్రభుత్వం అనువుగాని చోట ఒక్క సెంటు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని దుయ్యబట్టారు. అర్ధాంతరంగా ఇళ్ల నిర్మాణం ఆపేసి పేదలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.

హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.