తెలుగుదేశం హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే.. తామే పెండింగ్ పనులు పూర్తిచేసి గృహప్రవేశం చేయిస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం కొట్టిపి రోడ్డులో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను బాలకృష్ణ పరిశీలించారు. లబ్ధిదారులతో కలిసి 'నా ఇల్లు-నా సొంతం' అంటూ నినదించారు. గత ప్రభుత్వం రెండు సెంట్లలో పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే.. వైకాపా ప్రభుత్వం అనువుగాని చోట ఒక్క సెంటు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని దుయ్యబట్టారు. అర్ధాంతరంగా ఇళ్ల నిర్మాణం ఆపేసి పేదలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.
ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన