ETV Bharat / state

గంజాయి విక్రయ కేంద్రంపై పోలీసుల దాడి

author img

By

Published : Apr 30, 2019, 5:00 PM IST

గంజాయి విక్రయ కేంద్రంపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు దాడి చేశారు. 700 గ్రాముల గంజాయి సంచులు, రూ.27,450 నగదు స్వాధీనం చేసుకున్నారు.

arrest-of-ganjay-managers
arrest-of-ganjay-managers

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గంజాయి ముఠా గట్టు రట్టు చేశారు.. పోలీసులు. పట్టణంలో గంజాయి విక్రయ కేంద్రంపై దాడి చేసి ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 700 గ్రాముల గంజాయి సంచులు, రూ.27,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గాంధీ కట్ట సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చిందని డీఎస్పీ జయరామ సుబ్బా రెడ్డి తెలిపారు. సిబ్బందితో కలిసి దాడులు చేయగా మునీర్, శేక్షావళి, సైదు అనే ముగ్గురు పరారయ్యారన్నారు. ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరంతా విజయవాడ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గతంలో వీరిపై మూడు గంజాయి కేసులు, నాలుగు మట్కా కేసులు ఉన్నాయన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.

arrest-of-ganjay-managers

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గంజాయి ముఠా గట్టు రట్టు చేశారు.. పోలీసులు. పట్టణంలో గంజాయి విక్రయ కేంద్రంపై దాడి చేసి ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 700 గ్రాముల గంజాయి సంచులు, రూ.27,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గాంధీ కట్ట సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చిందని డీఎస్పీ జయరామ సుబ్బా రెడ్డి తెలిపారు. సిబ్బందితో కలిసి దాడులు చేయగా మునీర్, శేక్షావళి, సైదు అనే ముగ్గురు పరారయ్యారన్నారు. ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరంతా విజయవాడ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గతంలో వీరిపై మూడు గంజాయి కేసులు, నాలుగు మట్కా కేసులు ఉన్నాయన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.

ఇవీ చదవండి....

నాసికరం విత్తనాల విక్రయం... నలుగురిపై చర్యలు

Intro:ap_knl_101_30_akram_tavvakaalu_av_c10 ఆళ్ళగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ శాఖ అడ్డుకున్నారు తవ్వకాలు జరుగుతున్న సమాచారం అందుకున్న తాసిల్దార్ రవి శంకర్ రెడ్డి పోలీసులతో వెళ్లి అడ్డుకున్నారు తవ్వకాలు చేస్తున్న జెసిబి తో సహా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని తరలించారు గత కొన్ని రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతుండగా ఎట్టకేలకు రెవెన్యూ శాఖ స్పందించడం గమనార్హం


Body:ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవిన్యూ శాఖ వాహనాలు పట్టివేత


Conclusion:ఆరు ట్రాక్టర్లు ఒక జెసిబి పట్టివేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.