ETV Bharat / state

బియ్యంపై రామనామం రాసి భక్తిని చాటుకున్న బాలిక - అనంతపురం విద్యార్థిని కళాసృష్టి

వేలాది బియ్యపు గింజలపై 'రామ' అని రాసి.. ఆయనపై ఉన్న భక్తిని చాటుకుంది ఓ విద్యార్థిని. అనంతపురానికి చెందిన విద్యార్థిని శ్రీనేహ.. రామ నామం రాసిన 3,216 గింజలను సీతారాముల చిత్రపటంపై అతికించింది.

rice art by anantapuram student, girl devotion towards srirama
వేలాది బియ్యం గింజలపై రామనామం, అనంతపురంలో వినూత్నంగా భక్తిని చాటిన బాలిక
author img

By

Published : Apr 21, 2021, 10:44 PM IST

శ్రీరామ నవమి సందర్భంగా.. అనంతపురం నగరానికి చెందిన శ్రీనేహ అనే ఎనిమిదో తరగతి బాలిక వినూత్న రీతిలో భక్తిని చాటుకుంది. 3,216 బియ్యపు గింజలపై 'రామ' నామం రాసి, వాటిని సీతారాముల చిత్రపటంపై అతికించింది. రాముడి భక్తుడైన తాత సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ విద్యార్థిని తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా తగ్గాక.. 'వహ్​ తాజ్'​ అనాల్సిందే..

పండుగను పురస్కరించుకుని నగరంలోని శ్రీనివాస్​నగర్​లో ఉన్న రామాలయానికి ఈ చిత్రపటాన్ని శ్రీనేహ అందించింది. ప్రతి బియ్యపు గింజపైనా 'రామ' అని రాసినట్లు బాలిక తెలిపింది. దీనిని చూసిన ఆలయ అర్చకులు చిన్నారిని అభినందించారు.

శ్రీరామ నవమి సందర్భంగా.. అనంతపురం నగరానికి చెందిన శ్రీనేహ అనే ఎనిమిదో తరగతి బాలిక వినూత్న రీతిలో భక్తిని చాటుకుంది. 3,216 బియ్యపు గింజలపై 'రామ' నామం రాసి, వాటిని సీతారాముల చిత్రపటంపై అతికించింది. రాముడి భక్తుడైన తాత సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ విద్యార్థిని తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా తగ్గాక.. 'వహ్​ తాజ్'​ అనాల్సిందే..

పండుగను పురస్కరించుకుని నగరంలోని శ్రీనివాస్​నగర్​లో ఉన్న రామాలయానికి ఈ చిత్రపటాన్ని శ్రీనేహ అందించింది. ప్రతి బియ్యపు గింజపైనా 'రామ' అని రాసినట్లు బాలిక తెలిపింది. దీనిని చూసిన ఆలయ అర్చకులు చిన్నారిని అభినందించారు.

ఇదీ చదవండి:

హనుమంతుడి జన్మస్థానం...అంజనాద్రే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.