ఈనాడు హాయ్బుజ్జీ కోసం వేసిన చిత్రానికి వచ్చిన బహుమతితో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న అనంతపురం జిల్లా మహిళ.... రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో చిత్రించి అంతర్జాతీయ అవార్డు పొందారు. కదిరికి చెందిన బసెట్టి జయలక్ష్మి... చిన్నప్పటి నుంచీ పెయింటింగ్పై ఆసక్తి పెంచుకున్నారు. వివాహం అనంతరం సింగపూర్లో స్థిరపడిన జయలక్ష్మి... భర్త సహకారంతో పెన్సిల్ ఆర్ట్పై దృష్టిపెట్టారు. ఇటీవల 23 గంటల్లో 22 చిత్రాలు వేసి ట్రింప్ వరల్డ్ అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదీ చూడండి