'అమరావతి ముద్దు-మూడు రాజధానులు వద్దు' అంటూ... గుంతకల్లులో అమరావతి ఐకాస అధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా మాజీఎమ్మెల్యే జితేంద్రగౌడ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. 'సేవ్ అమరావతి' అంటూ ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదీ చదవండి :