Fake calls: అమరావతి నుంచి మాట్లాడుతున్నామంటూ అధికారుల మాదిరిగా వాలంటీర్లకు ఫోన్ చేసి పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు తీసుకుంటున్న మోసగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేస్తున్నారు. వారి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ఓటీపీ వస్తుంది చెప్పాలంటూ ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో చోడవరం-5 వార్డు సచివాలయంలో అమ్మాజీ అనే మహిళ ఖాతా నుంచి రూ.2 వేలు ఇలాగే కొట్టేశారు. అడ్డూరులో ఓ లబ్ధిదారు ఖాతా నుంచి రూ.73 వేలు లాగేశారు. ఇలా ఒకే ఫోన్ నంబరు నుంచి చాలామందికి ఫోన్లు వచ్చాయి. ఈ నకిలీ ఫోన్కాల్స్పై చోడవరం-5 మహిళా పోలీస్ బగ్గు శివలక్ష్మి వాలంటీర్లను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: