ETV Bharat / sports

'అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు కోహ్లీ చెప్పిందే ఫాలో అవుతున్నారు'.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్

author img

By

Published : Jan 2, 2023, 2:11 PM IST

ఒకప్పుడు టీమ్ఇండియా విషయంలో విరాట్​ కోహ్లీ చెప్పిన సూచనల్ని పట్టించుకోలేదు బీసీసీఐ. అయితే, ఇప్పుడు అతడి సూచనలనే పాటిస్తోంది. వన్డే వరల్డ్​ కప్​నకు 20 మందిని ఎంపిక చేసిన క్రికెట్​ బోర్డు.. కోహ్లీ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయంపై కోహ్లీ అభిమానులు ఫైర్​ అవుతున్నారు. అప్పట్లో కోహ్లీ సూచనలు పాటించి ఉంటే.. ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియా మరింత మెరుగ్గా రాణించేదని అంటున్నారు.

kohli suggestions to bcci
kohli suggestions to bcci

2022 సంవత్సరం క్రికెట్​లో టీమ్ఇండియాకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టులో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. వ్యక్తిగతంగా సూర్య కుమార్​ యాదవ్​ లాంటి ఆటగాళ్లకు చాలా అనుకూలించింది. కానీ జట్టుగా టీమ్​ఇండియాకు ఆ ఏడాది తీవ్ర నిరాశ మిగిల్చింది. బుమ్రా, జడేజా లాంటి స్టార్ ప్లేయర్లను గాయాలు వేటాడాయి. టీమ్​ఇండియాను ఓటములు వెంటాడాయి. టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో కూడా జట్టు పేలవ ప్రదర్శన చేసి ఓటమి మూటగట్టుకుంది. జట్టు ఈ పరిస్థితికి దిగజారడానికి ఓ రకంగా బీసీసీఐ యాజమాన్యానిదే బాధ్యత. ఎందుకంటే.. ప్లేయర్లు గాయాలు పాలు కాకుండా చూసుకోవడంలో విఫలమయ్యారు బోర్డు పెద్దలు. దీంతో సమర్థవంతమైన జట్టు కూర్పులో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

గాయాల సమస్యలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించిన విరాట్ కోహ్లీ.. 2019లో తాను కెప్టెన్​గా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే బీసీసీఐకి కూడా కొన్ని సూచనలు చేశాడు. వన్డే ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లు.. ముఖ్యంగా పేస్​ బౌలర్లు ఐపీఎల్‌లో గాయాలపాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. వాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేసే అంశంపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. కానీ, అప్పుడు గంగూలీ సారథ్యంలో నడిచిన బీసీసీఐ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. వేలంలో రూ.కోట్లు పెట్టి దక్కించుకున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వమని ఫ్రాంచైజీలను ఎలా అడుగుతారని.. కోహ్లీపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. కోహ్లీ ఊహించినదే నిజమైంది. జడ్డూ, బుమ్రా గాయాల కారణంగా.. టీమ్​కు ఎనలేని నష్టం జరిగింది. ఈ మధ్య కాలంలో జట్టు సైతం పరిస్థితి దిగజారింది. వర్క్​లోడ్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

kohli suggestions to bcci
.

దీంతో కోహ్లీ చెప్పిన సూచనల విలువ బీసీసీఐకి తెలిసొచ్చింది. అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కోహ్లీ చెప్పిన అవే సూచనలను ఇప్పుడు అమలు చేస్తోంది. వరల్డ్​ కప్​ ఆడే ప్లేయర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వీవీఎస్​ లక్ష్మణ్​ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీని ఆదేశించినట్లు సమాచారం. అదే విధంగా వాళ్లను మానిటర్​ చేసి.. వర్క్​లోడ్​ ఎక్కువ కాకుండా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలతో కూడా చర్చించాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్​ కప్​ కోసం ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లను జాగ్రత్తగా గమనించాలని తెలిపినట్లు సమాచారం. అదేసమయంలో యోయో టెస్టులను సైతం బీసీసీఐ తప్పనిసరి చేసింది. పరిమిత ఓవర్లకు ఇద్దరు సారథులు ఉండకూడదని చెప్పి కోహ్లీని వన్డే కెప్టెన్​గా తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు రూటు మార్చింది. టీ20ల సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది.

kohli suggestions to bcci
.

ఫైర్​ అవుతున్న కోహ్లీ ఫ్యాన్స్​..
అప్పుడు కోహ్లీతో బీసీసీఐ వ్యవహరించిన తీరును ఫ్యాన్స్​ తప్పుబడుతున్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలపై స్పందిస్తూ సోషల్​ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 'అప్పుడు కోహ్లీ చెప్పినప్పుడు బీసీసీఐ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. కోహ్లీ అందరికంటే ముందున్నాడు' అంటూ ఓ నెటిజన్​ రాసుకొచ్చాడు. మరో యూజర్​ ' కోహ్లీ ఈరోజు ఆలోచిస్తే.. అదే విషయాన్ని బీసీసీఐ రేపు ఆలోచిస్తుంది' అని కామెంట్​ చేశాడు. టీమ్​కు ఫిట్​నెస్ ప్రమాణాలు ఉండాలని కోహ్లీ తరచూ చెప్పేవాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ ఇప్పుడు యోయో టెస్టులు తప్పనిసరి చేసి.. అతడి ఆలోచననే మళ్లీ అమలు చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇవేవో అప్పుడే పాటించి ఉంటే టీమ్ఇండియా.. ప్రపంచ టోర్నీల్లో మెరుగ్గా రాణించేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

kohli suggestions to bcci
.

2022 సంవత్సరం క్రికెట్​లో టీమ్ఇండియాకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టులో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. వ్యక్తిగతంగా సూర్య కుమార్​ యాదవ్​ లాంటి ఆటగాళ్లకు చాలా అనుకూలించింది. కానీ జట్టుగా టీమ్​ఇండియాకు ఆ ఏడాది తీవ్ర నిరాశ మిగిల్చింది. బుమ్రా, జడేజా లాంటి స్టార్ ప్లేయర్లను గాయాలు వేటాడాయి. టీమ్​ఇండియాను ఓటములు వెంటాడాయి. టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో కూడా జట్టు పేలవ ప్రదర్శన చేసి ఓటమి మూటగట్టుకుంది. జట్టు ఈ పరిస్థితికి దిగజారడానికి ఓ రకంగా బీసీసీఐ యాజమాన్యానిదే బాధ్యత. ఎందుకంటే.. ప్లేయర్లు గాయాలు పాలు కాకుండా చూసుకోవడంలో విఫలమయ్యారు బోర్డు పెద్దలు. దీంతో సమర్థవంతమైన జట్టు కూర్పులో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

గాయాల సమస్యలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించిన విరాట్ కోహ్లీ.. 2019లో తాను కెప్టెన్​గా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే బీసీసీఐకి కూడా కొన్ని సూచనలు చేశాడు. వన్డే ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లు.. ముఖ్యంగా పేస్​ బౌలర్లు ఐపీఎల్‌లో గాయాలపాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. వాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేసే అంశంపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. కానీ, అప్పుడు గంగూలీ సారథ్యంలో నడిచిన బీసీసీఐ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. వేలంలో రూ.కోట్లు పెట్టి దక్కించుకున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వమని ఫ్రాంచైజీలను ఎలా అడుగుతారని.. కోహ్లీపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. కోహ్లీ ఊహించినదే నిజమైంది. జడ్డూ, బుమ్రా గాయాల కారణంగా.. టీమ్​కు ఎనలేని నష్టం జరిగింది. ఈ మధ్య కాలంలో జట్టు సైతం పరిస్థితి దిగజారింది. వర్క్​లోడ్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

kohli suggestions to bcci
.

దీంతో కోహ్లీ చెప్పిన సూచనల విలువ బీసీసీఐకి తెలిసొచ్చింది. అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కోహ్లీ చెప్పిన అవే సూచనలను ఇప్పుడు అమలు చేస్తోంది. వరల్డ్​ కప్​ ఆడే ప్లేయర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వీవీఎస్​ లక్ష్మణ్​ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీని ఆదేశించినట్లు సమాచారం. అదే విధంగా వాళ్లను మానిటర్​ చేసి.. వర్క్​లోడ్​ ఎక్కువ కాకుండా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలతో కూడా చర్చించాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్​ కప్​ కోసం ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లను జాగ్రత్తగా గమనించాలని తెలిపినట్లు సమాచారం. అదేసమయంలో యోయో టెస్టులను సైతం బీసీసీఐ తప్పనిసరి చేసింది. పరిమిత ఓవర్లకు ఇద్దరు సారథులు ఉండకూడదని చెప్పి కోహ్లీని వన్డే కెప్టెన్​గా తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు రూటు మార్చింది. టీ20ల సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది.

kohli suggestions to bcci
.

ఫైర్​ అవుతున్న కోహ్లీ ఫ్యాన్స్​..
అప్పుడు కోహ్లీతో బీసీసీఐ వ్యవహరించిన తీరును ఫ్యాన్స్​ తప్పుబడుతున్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలపై స్పందిస్తూ సోషల్​ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 'అప్పుడు కోహ్లీ చెప్పినప్పుడు బీసీసీఐ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. కోహ్లీ అందరికంటే ముందున్నాడు' అంటూ ఓ నెటిజన్​ రాసుకొచ్చాడు. మరో యూజర్​ ' కోహ్లీ ఈరోజు ఆలోచిస్తే.. అదే విషయాన్ని బీసీసీఐ రేపు ఆలోచిస్తుంది' అని కామెంట్​ చేశాడు. టీమ్​కు ఫిట్​నెస్ ప్రమాణాలు ఉండాలని కోహ్లీ తరచూ చెప్పేవాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ ఇప్పుడు యోయో టెస్టులు తప్పనిసరి చేసి.. అతడి ఆలోచననే మళ్లీ అమలు చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇవేవో అప్పుడే పాటించి ఉంటే టీమ్ఇండియా.. ప్రపంచ టోర్నీల్లో మెరుగ్గా రాణించేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

kohli suggestions to bcci
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.