ETV Bharat / sports

'టీమ్‌ఇండియాను తక్కువ అంచనా వేశాం'

author img

By

Published : Aug 17, 2021, 3:38 PM IST

రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేశామని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు.  టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా (34*), మహ్మద్‌ షమి (56*) తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు.

జోరూట్‌
జోరూట్‌

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ స్పందించాడు. తమ జట్టు వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడిందని.. భారత జట్టులో ఆర్డర్​ను తక్కువగా అంచనా వేశామని అంగీకరించాడు.

"కెప్టెన్‌గా నేను పొరపాట్లు చేశా. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమి, బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో సందేహం లేదు. వారిని నేను అడ్డుకోలేకపోయా. దాంతో మా జట్టు కష్టాల్లో పడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడనందుకు నిరాశపడుతున్నా. లోయర్‌ ఆర్డర్‌ డిఫెన్స్‌ను అంచనా వేయడంలో పొరపడ్డా."

-జోరూట్‌ ఇంగ్లాడ్ కెప్టెన్

షమి, బుమ్రాపై ప్రయోగించిన షార్ట్‌ బంతుల వ్యూహం విఫలమైందని రూట్‌ తెలిపాడు. "నిజానికి మేం స్టంప్స్‌కు నేరుగా దాడి చేస్తూ షార్ట్‌ పిచ్‌ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో! ఏదేమైనా వారిద్దరికీ ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో పరుగులు చేయడం వల్ల ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేకపోయా. ఇక ముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం" అని అతడు పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా దూకుడులో తప్పేమీ లేదని రూట్‌ స్పష్టం చేశాడు. "విరాట్‌ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే నాది భిన్నమైన ఆటతీరు. విరాట్‌సేన నిజాయతీగానే ఆడింది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను టీమ్‌ఇండియా ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు" అని అతడు వెల్లడించాడు.

ఇవీ చదవండి:

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ స్పందించాడు. తమ జట్టు వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడిందని.. భారత జట్టులో ఆర్డర్​ను తక్కువగా అంచనా వేశామని అంగీకరించాడు.

"కెప్టెన్‌గా నేను పొరపాట్లు చేశా. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమి, బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో సందేహం లేదు. వారిని నేను అడ్డుకోలేకపోయా. దాంతో మా జట్టు కష్టాల్లో పడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడనందుకు నిరాశపడుతున్నా. లోయర్‌ ఆర్డర్‌ డిఫెన్స్‌ను అంచనా వేయడంలో పొరపడ్డా."

-జోరూట్‌ ఇంగ్లాడ్ కెప్టెన్

షమి, బుమ్రాపై ప్రయోగించిన షార్ట్‌ బంతుల వ్యూహం విఫలమైందని రూట్‌ తెలిపాడు. "నిజానికి మేం స్టంప్స్‌కు నేరుగా దాడి చేస్తూ షార్ట్‌ పిచ్‌ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో! ఏదేమైనా వారిద్దరికీ ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో పరుగులు చేయడం వల్ల ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేకపోయా. ఇక ముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం" అని అతడు పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా దూకుడులో తప్పేమీ లేదని రూట్‌ స్పష్టం చేశాడు. "విరాట్‌ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే నాది భిన్నమైన ఆటతీరు. విరాట్‌సేన నిజాయతీగానే ఆడింది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను టీమ్‌ఇండియా ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు" అని అతడు వెల్లడించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.