By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 4:06 PM IST
|Updated : Jan 3, 2024, 5:16 PM IST
LIVE : టీడీపీలోకి విజయసాయి రెడ్డి బంధువులు - ప్రత్యక్షప్రసారం
LIVE: రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ పోకడ, చర్యలు నచ్చక చాలా మంది నేతలు తెలుగుదేశంలో భారీగా చేరుతున్నారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి బంధువులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వారంతా టీడీపీలో చేరేందుకు ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. అందులో విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ రెడ్డితో పాటు అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం వైఎస్సార్సీపీ కార్యకర్తలున్నారు. వీరంతా చంద్రాబాబు హయంలోనే తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.
విజయసాయి, ఆయన భార్య మినహా బందువులంతా టీడీపీలో చేరేందుకు తరలివచ్చినట్లు విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ రెడ్డి వివరించారు. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి దంపతులు కూడా వైఎస్సార్సీపీని వీడే పరిస్థితి రావొచ్చేమోనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిని తెలుగుదేశంలోకి రమ్మని ఆహ్వానించే హక్కు కూడా తనకుందని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీలో తనకు పలుమార్లు టిక్కెట్ ఇస్తానని మాట తప్పారని ఆయన ఆరోపించారు. రాయచోటి టిక్కెట్ ఇవ్వకపోయినా, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి కూడా మోసగించారన్నారు.