LIVE: గుడివాడలో 'రా కదలిరా' బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 3:23 PM IST
|Updated : Jan 18, 2024, 6:48 PM IST
Chandrababu Naidu Gudivada Public Meeting: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం గుడివాడలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపు స్ఫూర్తితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో నేడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మల్లాయిపాలెం వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం వద్ద భారీ స్వాగత ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో అలంకరించారు. సభను జనసేన పార్టీ సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. 50వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వాహన సౌకర్యం కల్పించారు. బందరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో గుడివాడ పట్టణం రహదారులు పసుపు మయంగా మారాయి. గుడివాడలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.