ETV Bharat / jagte-raho

వరంగల్ నిందితుడే... ఆంధ్రా యువతి హంతకుడు? - women murder news neddhavolu

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లాలో ఒకే కుటుంబ సభ్యులను బావిలో తోసి చంపేసిన సంజయ్ కుమార్ యాదవ్ కు... పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం వద్ద యువతిని హత్య చేసిన కేసుతో సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు.

Warangal accused of  murder of a young woman in Andhra
వరంగల్ నిందితుడే...ఆంధ్రలో యువతి హత్యకు కారణం
author img

By

Published : May 25, 2020, 8:58 PM IST

జాతీయ స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది.. తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లాలోని బావిలో మృతదేహాల కేసు. ఇందులో ప్రధాన నిందితుడైన సంజయ్ కుమార్ యాదవ్ నేర చరిత్ర.. ఆంధ్రప్రదేశ్ తోనూ ముడిపడి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం వద్ద యువతి హత్య కేసులోనూ.. సంజయ్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే పోలీసులకు వరంగల్ పోలీసులు సమాచారం అందించారు. మార్చి 8న చోటీ అనే యువతిని హైదరాబాద్ నుంచి రైలులో సంజయ్ తీసుకొచ్చాడు.

పశ్చిమ గోదావరిజిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం సమీపానికి వచ్చాక చున్నితో గొంతు బిగించి.. రైలు నుంచి తోసేశాడు. నిడదవోలు రైల్వే పోలీసులు ఆ యువతిది అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసులు అందించిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు.

హత్యకు గురైన చోటీ అనే యువతి వివరాలు ఆరా తీయడం వల్లే.. సంజయ్ హత్య ఇంతటి పని చేసినట్టుగా అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:

రాష్టంలో మరో 4 రోజులుపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు!

జాతీయ స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది.. తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లాలోని బావిలో మృతదేహాల కేసు. ఇందులో ప్రధాన నిందితుడైన సంజయ్ కుమార్ యాదవ్ నేర చరిత్ర.. ఆంధ్రప్రదేశ్ తోనూ ముడిపడి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం వద్ద యువతి హత్య కేసులోనూ.. సంజయ్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే పోలీసులకు వరంగల్ పోలీసులు సమాచారం అందించారు. మార్చి 8న చోటీ అనే యువతిని హైదరాబాద్ నుంచి రైలులో సంజయ్ తీసుకొచ్చాడు.

పశ్చిమ గోదావరిజిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం సమీపానికి వచ్చాక చున్నితో గొంతు బిగించి.. రైలు నుంచి తోసేశాడు. నిడదవోలు రైల్వే పోలీసులు ఆ యువతిది అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసులు అందించిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు.

హత్యకు గురైన చోటీ అనే యువతి వివరాలు ఆరా తీయడం వల్లే.. సంజయ్ హత్య ఇంతటి పని చేసినట్టుగా అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:

రాష్టంలో మరో 4 రోజులుపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.