ETV Bharat / jagte-raho

బహుమతులు ఆశచూపుతాడు.. బంగారం దోచేస్తాడు

author img

By

Published : Nov 14, 2020, 12:08 AM IST

వాయిదా పద్ధతిపై గృహోపకరణాలు అమ్ముతూ అమాయకులను మోసం చేస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ. వాయిదాల్లో వస్తువులు కొన్న వినియోగదారులకు బహుమతి వచ్చిందంటూ నమ్మబలికి వారి వద్ద ఉన్న బంగారంతో ఉడాయించేస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎకంగా 23 కేసులు అతడిపై తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. కేటుగాడుపై ఫోకస్​ పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

most-wanted-thief-
most-wanted-thief-

దృష్టిమరల్చి చోరీలకు పాల్పడుతున్న దొంగను హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 33తులాల బంగారం, ఓ ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన అహ్మద్ బతుకుదెరువు కోసం 11ఏళ్ల వయసులో హైదరాబాద్​కు వచ్చాడు. చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న అహ్మద్.. వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. చోరీలు చేసేందుకు గృహోపకరణాల విక్రయాన్ని ఎంచుకున్నాడు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్​లలో వాయిదా పద్ధతిపై గృహోపకరణాలు ఇస్తూ.. వ్యాపారం చేసేవాడు. బహుమతి వచ్చిందంటూ అమాయకులను నమ్మించి హైదరాబాద్​లోని కార్యాలయానికి రమ్మనేవాడు.

ఒంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ధనికులుగా భావించి బహుమతులు ఇవ్వరని మాయమాటలు చెప్పి... వారి వద్ద ఉన్న ఆభరణాలు తీసుకొని ఉడాయించేవాడు. నిందితుడు అహ్మద్​పై హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్​లలో 23 కేసులున్నాయి. మహారాష్ట్రలో అత్యాచారం కేసులో జైలుశిక్ష కూడా అనుభవించాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

దృష్టిమరల్చి చోరీలకు పాల్పడుతున్న దొంగను హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 33తులాల బంగారం, ఓ ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన అహ్మద్ బతుకుదెరువు కోసం 11ఏళ్ల వయసులో హైదరాబాద్​కు వచ్చాడు. చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న అహ్మద్.. వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. చోరీలు చేసేందుకు గృహోపకరణాల విక్రయాన్ని ఎంచుకున్నాడు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్​లలో వాయిదా పద్ధతిపై గృహోపకరణాలు ఇస్తూ.. వ్యాపారం చేసేవాడు. బహుమతి వచ్చిందంటూ అమాయకులను నమ్మించి హైదరాబాద్​లోని కార్యాలయానికి రమ్మనేవాడు.

ఒంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ధనికులుగా భావించి బహుమతులు ఇవ్వరని మాయమాటలు చెప్పి... వారి వద్ద ఉన్న ఆభరణాలు తీసుకొని ఉడాయించేవాడు. నిందితుడు అహ్మద్​పై హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్​లలో 23 కేసులున్నాయి. మహారాష్ట్రలో అత్యాచారం కేసులో జైలుశిక్ష కూడా అనుభవించాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

ఇవీ చూడండి:

సైబర్‌వల.. చిక్కావో విలవిల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.