ETV Bharat / jagte-raho

కదులుతున్న డొంక... లోన్​యాప్‌లో చైనీయుల హస్తం

author img

By

Published : Dec 23, 2020, 12:04 AM IST

ఆన్​లైన్ రుణ సంస్థల్లో చైనీయుల పెట్టుబడి ఉన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఆన్ లైన్ కలర్ గేమింగ్​లోనూ చైనీయులు హస్తం ఉన్నట్లు ఇది వరకే తేల్చిన సీసీఎస్ పోలీసులు.... రుణ సంస్థల్లోనూ తెరవెనక ఉండి తతంగాన్ని నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. సులభంగా రుణాలు మంజూరు చేసి... అధికంగా వడ్డీ వసూలు చేస్తున్న ఆన్​లైన్ రుణ సంస్థలపై పలుచోట్ల వరుస కేసులు నమోదవుతుండటంతో... పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

loan-app
loan-app

కదులుతున్న డొంక... లోన్​యాప్‌లో చైనీయుల హస్తం

ప్లేస్టోర్​నుంచి యాప్​ డౌన్​లోడ్ చేసుకొని అడిగిన వివరాలు సమర్పిస్తే చాలు స్వల్ప రుణం మంజూరవుతోంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వివరాలను బట్టి ఆన్​లైన్ రుణ సంస్థలు 2 నుంచి 10వేల రూపాయల వరకు సులభంగా రుణాలు ఇస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వసూలు చేసేటప్పుడు మాత్రం నిర్వాహకులు రుణగ్రహీతల రక్తం తాగుతున్నారు. తీసుకున్న రుణానికి 20 శాతం వడ్డీ లెక్కించి వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించని వాళ్లకు 60శాతం వరకు కూడా వడ్డీ విధిస్తున్నారు. చెల్లించని వాళ్లను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో ఈ తరహా కేసులు 16 నమోదయ్యాయి. రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి.

40వేల కాల్స్

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు 11మందిని అరెస్ట్ చేశారు. వీరిలో గురుగావ్​కు చెందిన ఐదుగురు, హైదరాబాద్​కు చెందిన ఆరుగురు ఉన్నారు. గురుగావ్​లోని రెండు కాల్ సెంటర్లలో 500 మంది, హైదరాబాద్​లోని మూడు కాల్ సెంటర్లలో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగి రోజుకు 60 నుంచి 80 ఫోన్లు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో కాల్ సెంటర్ నుంచి దాదాపు 40వేలకు పైగా ఫోన్లు వెళ్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయించడమే ఈ కాల్ సెంటర్ల లక్ష్యం. బెంగళూర్​లో రిజిస్టర్ అయిన లియోఫాంగ్ టెక్నాలజీస్, హాట్ ఫుల్ టెక్నాలజీస్, పిన్ ప్రింట్ టెక్నాలజీస్, నబ్లూమ్ టెక్నాలజీస్ కాల్ సెంటర్ల నుంచి 16 ఆన్​లైన్ రుణ సంస్థలకు చెందిన వసూళ్లను పర్యవేక్షిస్తున్నారు.

చైనీయుల పెట్టుబడి

ఆన్​లైన్ రుణ సంస్థల్లో చైనీయులు పెట్టుబడి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సులభంగా రుణం ఇచ్చి భారీగా వడ్డీ వసూలు చేసి... ఆ డబ్బును పలు రూపాల్లో చైనా తరలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్​లోని మూడు కాల్ సెంటర్లలో పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను ప్రశ్నించడంతో... చైనాకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం కాల్ సెంటర్లకు వచ్చి పర్యవేక్షించి వెళ్లినట్లు తేలింది. గురుగావ్​లోని కాల్ సెంటర్లలో తనిఖీ చేసినప్పుడు ఓ చైనా వ్యక్తి పాస్ పోర్టు జిరాక్స్​ దొరకడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి

ఆన్​లైన్ కలర్ గేమింగ్ మోసంలోనూ చైనీయులు వెనక ఉండి కథ నడిపించారు. దిల్లీకి చెందిన వ్యక్తులను డైరెక్టర్లుగా ఉంచి ఈకామర్స్ పేరుతో పలు సంస్థలు స్థాపించారు. వాటి వెనుక ఆన్ లైన్ కలర్ గేమింగ్ నిర్వహించారు. దాదాపు 1,500 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి... హాంకాంగ్ మీదుగా చైనాకు డబ్బులు తరలించారు. ఈ కేసులో చైనీయుడితో పాటు.... దిల్లీకి చెందిన ఇద్దరు, గుజరాత్​కు చెందిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందల సంఖ్యలో ఉన్న ఆన్​లైన్ రుణ సంస్థల్లోనూ ఎక్కువ మేరకు చైనాకు చెందినవే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 10 బ్యాంకు ఖాతాలు, 80 వరకు యూపీఐ వాలెట్లను సీజ్ చేశారు. వీటిని పరిశీలించడం ద్వారా వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్​లైన్​లో రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ 5 కేసులు నమోదు కావడంతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఓ భవనాన్న అద్దెకు తీసుకుని నడుపుతున్న రెండు కంపనీలపై దాడులు నిర్వహించారు. ఆనియన్ క్రెడిట్, క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీ అనే రెండు కంపనీలు శరత్ చంద్ర అనే వ్యక్తి నడుపుతున్నట్లుగా గుర్తించారు. సొంతంగా పలు యాప్​లను తయారు చేసి వాటిని గూగూల్ ప్లేస్టోర్​లో పెట్టి డౌన్​లోడ్ చేసుకోమంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అనుమతులు ఇస్తే... అంతే

ఒక యాప్ నుంచి లోన్ తీసుకుంటే మరి కొన్ని యాప్‌లనుంచి కూడా లోన్లు తీసుకోమంటూ ప్రకటలు ఇస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఇన్‌స్టాల్ చేసుకునేటప్పులు పలు అనుమతులు అడుగుతుంది. ఇలా వ్యక్తిగత ఫొటోలు, ఫోన్​ నంబర్లు కాపీ చేసుకునే విధంగా యాప్​లను డిజైన్ చేస్తారు. వీరు ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల ద్వారా లోన్ తీసుకోమని అభ్యర్థిస్తారు. ఇందుకోసం 110 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అధిక ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, వడ్డీల పేరుతో ఇచ్చే లోన్ లోనే ఛార్జీలు తీసుకుని ఇస్తారు. ఇప్పటి వరకూ పలు యాప్​ల ద్వారా 1.5లక్షల కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు తయారు చేసిన యాప్​లలో నాలుగు యాప్​లను మరో రెండు కంపనీలకు కూడా విక్రయించినట్లు విచారణలో తేలింది.

మూడు దశల్లో ఫోన్లు

రుణం తీసుకున్న వారికి మొత్తం మూడు దశల్లో ఫోన్లు చేస్తారు. లోన్ కట్టాల్సిన రోజు డీ-0 బకెట్ అని, గడువు దాటి మూడు రోజుల లోపు ఎస్​1 బకెట్ అని, నాలుగు నుంచి 10 రోజుల లోపు ఎస్-2 బకెట్, ఇక చివరిగా 30 రోజులు ఆయితే ఎస్-3 బకెట్ అని కస్టమర్లను విభజించి కాల్ సెంటర్ల సిబ్బందికి వారి వివరాలు ఇస్తున్నారు. ఇందులో ఎస్-3 కేటగిరిలో తీవ్ర వేధింపులకు గురిచేస్తారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లో, బంధువులకు కస్టమర్లను కించపరుస్తూ ఫొటోలు, ఫోన్లు చేస్తారు. ఇలా ఈ రెండు కంపనీలు నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీటిలో ఏ ఒక్కటి కూడా ఆర్బీఐ, ఫినాన్స్ కార్పొరేషన్ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు.

ఆన్​లైన్ రుణ సంస్థలను తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్ ప్రతినిధులకు సైబర్ క్రైం పోలీసులు లేఖ రాశారు. సులభంగా రుణాలు వస్తున్నాయంటే నమ్మి.. వ్యక్తిగత వివరాలు, ఇతర వివరాలు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు చెల్లింపు విషయంలో వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

కదులుతున్న డొంక... లోన్​యాప్‌లో చైనీయుల హస్తం

ప్లేస్టోర్​నుంచి యాప్​ డౌన్​లోడ్ చేసుకొని అడిగిన వివరాలు సమర్పిస్తే చాలు స్వల్ప రుణం మంజూరవుతోంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వివరాలను బట్టి ఆన్​లైన్ రుణ సంస్థలు 2 నుంచి 10వేల రూపాయల వరకు సులభంగా రుణాలు ఇస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వసూలు చేసేటప్పుడు మాత్రం నిర్వాహకులు రుణగ్రహీతల రక్తం తాగుతున్నారు. తీసుకున్న రుణానికి 20 శాతం వడ్డీ లెక్కించి వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించని వాళ్లకు 60శాతం వరకు కూడా వడ్డీ విధిస్తున్నారు. చెల్లించని వాళ్లను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో ఈ తరహా కేసులు 16 నమోదయ్యాయి. రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి.

40వేల కాల్స్

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు 11మందిని అరెస్ట్ చేశారు. వీరిలో గురుగావ్​కు చెందిన ఐదుగురు, హైదరాబాద్​కు చెందిన ఆరుగురు ఉన్నారు. గురుగావ్​లోని రెండు కాల్ సెంటర్లలో 500 మంది, హైదరాబాద్​లోని మూడు కాల్ సెంటర్లలో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగి రోజుకు 60 నుంచి 80 ఫోన్లు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో కాల్ సెంటర్ నుంచి దాదాపు 40వేలకు పైగా ఫోన్లు వెళ్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయించడమే ఈ కాల్ సెంటర్ల లక్ష్యం. బెంగళూర్​లో రిజిస్టర్ అయిన లియోఫాంగ్ టెక్నాలజీస్, హాట్ ఫుల్ టెక్నాలజీస్, పిన్ ప్రింట్ టెక్నాలజీస్, నబ్లూమ్ టెక్నాలజీస్ కాల్ సెంటర్ల నుంచి 16 ఆన్​లైన్ రుణ సంస్థలకు చెందిన వసూళ్లను పర్యవేక్షిస్తున్నారు.

చైనీయుల పెట్టుబడి

ఆన్​లైన్ రుణ సంస్థల్లో చైనీయులు పెట్టుబడి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సులభంగా రుణం ఇచ్చి భారీగా వడ్డీ వసూలు చేసి... ఆ డబ్బును పలు రూపాల్లో చైనా తరలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్​లోని మూడు కాల్ సెంటర్లలో పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను ప్రశ్నించడంతో... చైనాకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం కాల్ సెంటర్లకు వచ్చి పర్యవేక్షించి వెళ్లినట్లు తేలింది. గురుగావ్​లోని కాల్ సెంటర్లలో తనిఖీ చేసినప్పుడు ఓ చైనా వ్యక్తి పాస్ పోర్టు జిరాక్స్​ దొరకడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి

ఆన్​లైన్ కలర్ గేమింగ్ మోసంలోనూ చైనీయులు వెనక ఉండి కథ నడిపించారు. దిల్లీకి చెందిన వ్యక్తులను డైరెక్టర్లుగా ఉంచి ఈకామర్స్ పేరుతో పలు సంస్థలు స్థాపించారు. వాటి వెనుక ఆన్ లైన్ కలర్ గేమింగ్ నిర్వహించారు. దాదాపు 1,500 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి... హాంకాంగ్ మీదుగా చైనాకు డబ్బులు తరలించారు. ఈ కేసులో చైనీయుడితో పాటు.... దిల్లీకి చెందిన ఇద్దరు, గుజరాత్​కు చెందిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందల సంఖ్యలో ఉన్న ఆన్​లైన్ రుణ సంస్థల్లోనూ ఎక్కువ మేరకు చైనాకు చెందినవే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 10 బ్యాంకు ఖాతాలు, 80 వరకు యూపీఐ వాలెట్లను సీజ్ చేశారు. వీటిని పరిశీలించడం ద్వారా వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్​లైన్​లో రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ 5 కేసులు నమోదు కావడంతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఓ భవనాన్న అద్దెకు తీసుకుని నడుపుతున్న రెండు కంపనీలపై దాడులు నిర్వహించారు. ఆనియన్ క్రెడిట్, క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీ అనే రెండు కంపనీలు శరత్ చంద్ర అనే వ్యక్తి నడుపుతున్నట్లుగా గుర్తించారు. సొంతంగా పలు యాప్​లను తయారు చేసి వాటిని గూగూల్ ప్లేస్టోర్​లో పెట్టి డౌన్​లోడ్ చేసుకోమంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అనుమతులు ఇస్తే... అంతే

ఒక యాప్ నుంచి లోన్ తీసుకుంటే మరి కొన్ని యాప్‌లనుంచి కూడా లోన్లు తీసుకోమంటూ ప్రకటలు ఇస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఇన్‌స్టాల్ చేసుకునేటప్పులు పలు అనుమతులు అడుగుతుంది. ఇలా వ్యక్తిగత ఫొటోలు, ఫోన్​ నంబర్లు కాపీ చేసుకునే విధంగా యాప్​లను డిజైన్ చేస్తారు. వీరు ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల ద్వారా లోన్ తీసుకోమని అభ్యర్థిస్తారు. ఇందుకోసం 110 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అధిక ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, వడ్డీల పేరుతో ఇచ్చే లోన్ లోనే ఛార్జీలు తీసుకుని ఇస్తారు. ఇప్పటి వరకూ పలు యాప్​ల ద్వారా 1.5లక్షల కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు తయారు చేసిన యాప్​లలో నాలుగు యాప్​లను మరో రెండు కంపనీలకు కూడా విక్రయించినట్లు విచారణలో తేలింది.

మూడు దశల్లో ఫోన్లు

రుణం తీసుకున్న వారికి మొత్తం మూడు దశల్లో ఫోన్లు చేస్తారు. లోన్ కట్టాల్సిన రోజు డీ-0 బకెట్ అని, గడువు దాటి మూడు రోజుల లోపు ఎస్​1 బకెట్ అని, నాలుగు నుంచి 10 రోజుల లోపు ఎస్-2 బకెట్, ఇక చివరిగా 30 రోజులు ఆయితే ఎస్-3 బకెట్ అని కస్టమర్లను విభజించి కాల్ సెంటర్ల సిబ్బందికి వారి వివరాలు ఇస్తున్నారు. ఇందులో ఎస్-3 కేటగిరిలో తీవ్ర వేధింపులకు గురిచేస్తారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లో, బంధువులకు కస్టమర్లను కించపరుస్తూ ఫొటోలు, ఫోన్లు చేస్తారు. ఇలా ఈ రెండు కంపనీలు నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీటిలో ఏ ఒక్కటి కూడా ఆర్బీఐ, ఫినాన్స్ కార్పొరేషన్ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు.

ఆన్​లైన్ రుణ సంస్థలను తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్ ప్రతినిధులకు సైబర్ క్రైం పోలీసులు లేఖ రాశారు. సులభంగా రుణాలు వస్తున్నాయంటే నమ్మి.. వ్యక్తిగత వివరాలు, ఇతర వివరాలు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు చెల్లింపు విషయంలో వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.