ETV Bharat / jagte-raho

యాదాద్రిలో దంపతులపై కత్తితో దాడి... భూవివాదాలే కారణం!

author img

By

Published : Oct 8, 2020, 9:29 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం ఎర్రంబెల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దంపతులపై కిరాతకంగా దాడి చేశాడు.

యాదాద్రిలో దంపతులపై కత్తితో దాడి... భూవివాదాలే కారణం!
యాదాద్రిలో దంపతులపై కత్తితో దాడి... భూవివాదాలే కారణం!

ఎర్రంబెల్లికి చెందిన నేలపట్ల వెంకటేశ్​... అదే గ్రామానికి చెందిన బొక్క నర్సిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న నర్సిరెడ్డి భార్య నీరజపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధిత దంపతులను స్థానికులు చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో నర్సిరెడ్డికి తీవ్రగాయాలు కాగా.. నీరజ స్వల్ప గాయలతో బయటపడ్డారు. భూ వివాదాల కారణంతోనే వెంకటేశ్​ దాడికి పాల్పడ్డాడంటూ స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎర్రంబెల్లికి చెందిన నేలపట్ల వెంకటేశ్​... అదే గ్రామానికి చెందిన బొక్క నర్సిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న నర్సిరెడ్డి భార్య నీరజపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధిత దంపతులను స్థానికులు చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో నర్సిరెడ్డికి తీవ్రగాయాలు కాగా.. నీరజ స్వల్ప గాయలతో బయటపడ్డారు. భూ వివాదాల కారణంతోనే వెంకటేశ్​ దాడికి పాల్పడ్డాడంటూ స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.