ETV Bharat / jagte-raho

చిత్తు కాగితాల పేరుతో రెక్కీ.. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చోరీ!

author img

By

Published : Nov 4, 2020, 4:27 PM IST

ఆమెను చూసేందుకు చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి లాగే అమాయకంగా కనిపిస్తుంది. ఏ ఇంటికైనా తాళం కనిపించి.. ఎవరూ లేరని తెలిస్తే చాలు. ఇట్టే చేతివాటం ప్రదర్శిస్తుంది. ఆమె కన్ను పడిందా.. ఆ ఇల్లు గుట్టుచప్పుడు కాకుండా గుల్ల కావాల్సిందే. అలాంటి మాయలేడిని పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటివాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

చిత్తు కాగితాలు ఏరుతూ.. ఇళ్లు గుల్ల చేస్తున్న వ్యక్తి అరెస్ట్
చిత్తు కాగితాలు ఏరుతూ.. ఇళ్లు గుల్ల చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పట్టపగలే తలుపులు తాళాలు పగలగొట్టి చోరీలు చేసే మహిళను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల టౌన్​లోని భీమా వారి పాలెంలో నివసించే శివరాం ప్రసాద్ అక్టోబర్​ 29న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఫంక్షన్​కి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం కొనేందుకు పోగేసుకున్న రూ.16 లక్షల నగదు, బంగారు నగలు బీరువాలో పెట్టి తాళం వేశాడు.

తిరిగి వచ్చేసరికి..

సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి వెనుక ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. నివాసంలోకి చొరబడిన దొంగలు రూ.16 లక్షల సొమ్ము, బంగారు నగలను చోరీ చేసినట్లు గుర్తించారు. బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

వేలిముద్రల ఆధారంగా..

చినరావూరుకి చెందిన శీలం దుర్గ ఈ చోరీ చేసినట్టు పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిగ్గు తేల్చారు. నిందితురాలిని అరెస్టు చేసి.. మొత్తం రూ. 15.37 లక్షల నగదు, 9 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

గతంలోనూ ఘనమే..

తెలంగాణలోని ఘట్ కేసర్ ప్రాంతంలో గతంలోనూ 3 దొంగతనాలు చేసిన నేర చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దొంగతనాలకు సంబంధించి 60 శాతం రికవరీ చేశామని వివరించారు. నిందితురాలు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి లాగా సంచరిస్తూ.. తాళాలు వేసిన గృహాలను గుర్తించి దొంగతనాలు చేస్తుందని డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

అనంతలో యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

పట్టపగలే తలుపులు తాళాలు పగలగొట్టి చోరీలు చేసే మహిళను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల టౌన్​లోని భీమా వారి పాలెంలో నివసించే శివరాం ప్రసాద్ అక్టోబర్​ 29న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఫంక్షన్​కి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం కొనేందుకు పోగేసుకున్న రూ.16 లక్షల నగదు, బంగారు నగలు బీరువాలో పెట్టి తాళం వేశాడు.

తిరిగి వచ్చేసరికి..

సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి వెనుక ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. నివాసంలోకి చొరబడిన దొంగలు రూ.16 లక్షల సొమ్ము, బంగారు నగలను చోరీ చేసినట్లు గుర్తించారు. బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

వేలిముద్రల ఆధారంగా..

చినరావూరుకి చెందిన శీలం దుర్గ ఈ చోరీ చేసినట్టు పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిగ్గు తేల్చారు. నిందితురాలిని అరెస్టు చేసి.. మొత్తం రూ. 15.37 లక్షల నగదు, 9 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

గతంలోనూ ఘనమే..

తెలంగాణలోని ఘట్ కేసర్ ప్రాంతంలో గతంలోనూ 3 దొంగతనాలు చేసిన నేర చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దొంగతనాలకు సంబంధించి 60 శాతం రికవరీ చేశామని వివరించారు. నిందితురాలు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి లాగా సంచరిస్తూ.. తాళాలు వేసిన గృహాలను గుర్తించి దొంగతనాలు చేస్తుందని డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

అనంతలో యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.