ETV Bharat / international

పద్మభూషణ్ అందుకున్న సత్య నాదెళ్ల.. త్వరలో భారత పర్యటన

author img

By

Published : Oct 20, 2022, 12:37 PM IST

భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ అవార్డును మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అమెరికాలో స్వీకరించారు. ఈ గుర్తింపు లభించడం గౌరవంగా ఉందని అన్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సత్య నాదెళ్ల.. భారత్​లో పర్యటిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

satya-nadella-receives-padma-bhushan
satya-nadella-receives-padma-bhushan

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఆయన ఒకరు. తాజాగా పురస్కారాన్ని అందుకున్న ఆయన.. భారత ప్రభుత్వ గుర్తింపు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి గతవారం ఆయన అవార్డు స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా తెలిపింది. ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్, నాదెళ్ల భేటీ అయినట్లు వెల్లడించింది. భవిష్యత్​లో భారత్ సాంకేతిక ప్రపంచశక్తిగా ఎదిగే అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు పేర్కొంది. భారత సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నాదెళ్ల పేర్కొన్నారు.

'ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా సంచలన మార్పులు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. వచ్చే దశాబ్దం పూర్తిగా డిజిటల్ సాంకేతికతదే. భారత్​లోని చిన్నాపెద్దా పరిశ్రమలు, సంస్థలు సాంకేతికతవైపు మళ్లుతున్నాయి. ఇది గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుంది.'
-సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

సత్య నాదెళ్ల వచ్చే ఏడాది జనవరిలో భారత్​లో పర్యటించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన భారత్​కు రావడం ఇదే తొలిసారి కానుంది. హైదరాబాద్​లో జన్మించిన నాదెళ్ల.. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్నారు. 2021 జూన్​లో ఆయన సంస్థకు ఛైర్మన్​గా ఎంపికయ్యారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఆయన ఒకరు. తాజాగా పురస్కారాన్ని అందుకున్న ఆయన.. భారత ప్రభుత్వ గుర్తింపు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి గతవారం ఆయన అవార్డు స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా తెలిపింది. ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్, నాదెళ్ల భేటీ అయినట్లు వెల్లడించింది. భవిష్యత్​లో భారత్ సాంకేతిక ప్రపంచశక్తిగా ఎదిగే అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు పేర్కొంది. భారత సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నాదెళ్ల పేర్కొన్నారు.

'ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా సంచలన మార్పులు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. వచ్చే దశాబ్దం పూర్తిగా డిజిటల్ సాంకేతికతదే. భారత్​లోని చిన్నాపెద్దా పరిశ్రమలు, సంస్థలు సాంకేతికతవైపు మళ్లుతున్నాయి. ఇది గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుంది.'
-సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

సత్య నాదెళ్ల వచ్చే ఏడాది జనవరిలో భారత్​లో పర్యటించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన భారత్​కు రావడం ఇదే తొలిసారి కానుంది. హైదరాబాద్​లో జన్మించిన నాదెళ్ల.. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్నారు. 2021 జూన్​లో ఆయన సంస్థకు ఛైర్మన్​గా ఎంపికయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.