ETV Bharat / crime

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. తల్లీకుమార్తెలు మృతి

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీకుమార్తెలు మృతి చెందారు. కారు నడుపుతున్న ఇంటిపెద్ద తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Jun 17, 2021, 10:16 AM IST

road accident
road accident

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో.. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన శ్రీనివాసరావు.. తన కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి విశాఖకు కారులో బయలుదేరారు.

పులపర్తి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో.. శ్రీనివాసరావు భార్య, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో.. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన శ్రీనివాసరావు.. తన కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి విశాఖకు కారులో బయలుదేరారు.

పులపర్తి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో.. శ్రీనివాసరావు భార్య, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

Chandrababu letter to CM: 'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.