ETV Bharat / crime

Hyderabad Pub Case: పుడింగ్ పబ్ కేసులో పోలీసు కస్టడీకి నిందితులు

author img

By

Published : Apr 14, 2022, 3:44 PM IST

Hyderabad Pub Case: హైదరాబాద్ ఫుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులు అనిల్‌, అభిషేక్‌లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనిల్, అభిషేక్‌లను నేటి నుంచి 4 రోజుల పాటు బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

పుడింగ్ పబ్ కేసులో పోలీసు కస్టడీకి నిందితులు
పుడింగ్ పబ్ కేసులో పోలీసు కస్టడీకి నిందితులు

Hyderabad Pub Case: హైదరాబాద్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అనిల్, అభిషేక్​లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బంజారాహిల్స్ పీఎస్​కు తరలించారు. నేటి నుంచి 4 రోజుల పాటు ఇద్దరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. అభిషేక్, అనిల్ చరవాణిలను విశ్లేషించిన బంజారాహిల్స్ పోలీసులు... వీళ్లిద్దరికీ మాదక ద్రవ్యాల విక్రేతలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరి చరవాణిల్లోనూ పలువురు మాదకద్రవ్యాల విక్రేతల నెంబర్లు ఉండటాన్ని గుర్తించారు. గోవా, ముంబయి నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్​లో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎవరెవరికి కొకైన్ విక్రయించారనే కోణంలో పోలీసులు అభిషేక్, అనిల్​ను ప్రశ్నించనున్నారు. 3వ తేదీ తెల్లవారుజాము పబ్​పై దాడి చేసిన పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై పంపించారు. పబ్ లో 4.6 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ ఎవరెవరికి సరఫరా చేయడానికి తీసుకొచ్చారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పుడింగ్ పబ్ కేసులో నెల రోజుల వ్యవధిలోనే మూడు పార్టీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మూడు పార్టీల్లోనూ తరచూ పబ్​కు వచ్చే వ్యక్తులే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీల్లోనూ కొకైన్ సరఫరా జరిగిండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్​పై దాడి జరిగిన రోజు మూడు నాలుగు గంటల వ్యవధిలో అభిషేక్ - అనిల్ మధ్య 15 సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్నిసార్లు ఇద్దరూ కలిసి ఏం మాట్లాడారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Hyderabad Pub Case: హైదరాబాద్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అనిల్, అభిషేక్​లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బంజారాహిల్స్ పీఎస్​కు తరలించారు. నేటి నుంచి 4 రోజుల పాటు ఇద్దరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. అభిషేక్, అనిల్ చరవాణిలను విశ్లేషించిన బంజారాహిల్స్ పోలీసులు... వీళ్లిద్దరికీ మాదక ద్రవ్యాల విక్రేతలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరి చరవాణిల్లోనూ పలువురు మాదకద్రవ్యాల విక్రేతల నెంబర్లు ఉండటాన్ని గుర్తించారు. గోవా, ముంబయి నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్​లో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎవరెవరికి కొకైన్ విక్రయించారనే కోణంలో పోలీసులు అభిషేక్, అనిల్​ను ప్రశ్నించనున్నారు. 3వ తేదీ తెల్లవారుజాము పబ్​పై దాడి చేసిన పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై పంపించారు. పబ్ లో 4.6 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ ఎవరెవరికి సరఫరా చేయడానికి తీసుకొచ్చారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పుడింగ్ పబ్ కేసులో నెల రోజుల వ్యవధిలోనే మూడు పార్టీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మూడు పార్టీల్లోనూ తరచూ పబ్​కు వచ్చే వ్యక్తులే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీల్లోనూ కొకైన్ సరఫరా జరిగిండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్​పై దాడి జరిగిన రోజు మూడు నాలుగు గంటల వ్యవధిలో అభిషేక్ - అనిల్ మధ్య 15 సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్నిసార్లు ఇద్దరూ కలిసి ఏం మాట్లాడారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Radisson Blu Pub: రాడిసన్ బ్లూ పబ్‌ లైసెన్స్ రద్దు

అర్ధరాత్రి పబ్​లో నిహారిక.. వీడియో రిలీజ్ చేసిన నాగబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.