ETV Bharat / crime

భర్త వేధింపులు భరించలేక.. భార్య ఆత్మహత్య

author img

By

Published : Apr 7, 2021, 2:29 PM IST

పెళ్లై 13 ఏళ్లు అవుతుంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా రెండో భార్య కావాలంటూ నిత్యం భార్యను వేధిస్తున్నాడు. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించినా అతను మారలేదు. భర్త హింసను తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

Husband harassment
Husband harassment

కర్నూలు జిల్లా నందవరం మండలం పోనకలదిన్నె గ్రామానికి చెందిన రాధకు.. దేవనకొండ మండలం కుక్కటికొండ గ్రామానికి చెందిన సుధాకర్​తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని రోజులుగా రెండో వివాహం చేసుకుంటానని భార్యను వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులపై గతంలో అతనికి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించామని మృతురాలి తండ్రి చెబుతున్నారు. భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రాధ ఆదివారం పురుగుల మందు తాగింది.. చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందింది.

కర్నూలు జిల్లా నందవరం మండలం పోనకలదిన్నె గ్రామానికి చెందిన రాధకు.. దేవనకొండ మండలం కుక్కటికొండ గ్రామానికి చెందిన సుధాకర్​తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని రోజులుగా రెండో వివాహం చేసుకుంటానని భార్యను వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులపై గతంలో అతనికి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించామని మృతురాలి తండ్రి చెబుతున్నారు. భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రాధ ఆదివారం పురుగుల మందు తాగింది.. చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందింది.

ఇదీ చదవండి: ఒంటరిగా ప్రయాణించినా.. మాస్కు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.