హైదరాబాద్లో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అరెస్టయ్యారు. పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో రఘునాథ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని విరసం, పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సరూర్నగర్ పరిధి పీఎన్టీ కాలనీలోని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఇంట్లో సోదాలు చేసింది. రఘునాథ్ కంప్యూటర్, ల్యాప్టాప్ను అధికారులు పరిశీలించారు.
ఇవీచూడండి: