తెలంగాణలో.. మాజీ మంత్రి ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్కు రుణం ఇచ్చినందుకు విచారణ పేరుతో అధికారులు వేధిస్తున్నారని కెనరా బ్యాంకు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. సర్వే పేరుతో అధికారులు వేధిస్తున్నారని.. జమునా హేచరీస్, ఈటల రాజేందర్ భార్య, కుమారుడు దాఖలు చేసిన పిటిషన్లో తమనూ ప్రతివాదిగా చేర్చాలని కోరింది. బ్యాంకు కీలక వేళల్లో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వచ్చి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని తన వ్యాజ్యంలో బ్యాంకు పేర్కొంది.
ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేయడం, వాట్సప్లో వ్యక్తిగత మెసేజ్లు చదవడం వంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జమునా హేచరీస్ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చలేమని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వేరే పిటిషన్ వేసుకోవాలని సూచిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఇవీ చూడండి: