ETV Bharat / crime

DWAKRA WOMEN MONEY SCAM: డబ్బులు కొట్టేశాం.. వాటాలు పంచుకున్నాం..

author img

By

Published : Sep 5, 2021, 11:29 AM IST

ఐదారేళ్లుగా బ్యాంకు సిబ్బందితో కలిసి ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్లో నుంచి నగదును స్వాహా చేశారు. అందరూ సమంగా వాటాలేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా దోచేసిన ఆ డబ్బుతో.. ఓ వ్యక్తి ఇంట్లో వాళ్లకి బంగారం, అక్కాచెల్లెల్ల పెళ్లిళ్లు చేశాడు. అదెక్కడో, అసలీ కథేంటో తెలుసుకోవాలనుందా... అయితే ఈ కథనం చదివేయండి.

bank-officials-agreed-their-hand-in-dwakra-women-money-scam
డబ్బులు కొట్టేశాం.. వాటాలు పంచుకున్నాం..

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన అక్రమాలపై విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి, వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త రూతు, ఏపీఎం సుబ్రహ్మణ్యం, సీసీలతో కలిసి బ్యాంకులో శనివారం దర్యాప్తు చేశారు. బ్యాంకు మెసెంజరు అలీఖాన్‌ వారికి పలు విషయాలు వెల్లడించారు. ప్రధానంగా శివలీల, ఓంశక్తి, చౌడేశ్వరి, గౌసియా, గణపతి, అలమతర, మక్కా ఎస్‌హెచ్‌జీ సంఘాలకు చెందిన రూ.76 లక్షల రుణాల సొమ్ముకు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసినట్లు అంగీకరించాడు.

భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా.. అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా..

ఈ నగదును బ్యాంకు సిబ్బందితో వాటాలు పంచుకున్నట్లు తెలిపారు. కాజేసిన నగదును ఏం చేశావని ప్రశ్నించగా... ‘ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకున్నా. భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా’ అని అతను వెల్లడించినట్లు సీఐ వివరించారు. ఐదారేళ్లుగా బ్యాంకు మేనేజరు కనుసన్నల్లోనే వ్యవహారం జరిగిందని, సబ్‌ మేనేజరు, క్లర్కులు, సిబ్బంది వాటాలు పంచుకున్నట్లు గుర్తించామన్నారు. మేడికుర్తికి చెందిన గౌసియా డ్వాక్రా సంఘం సభ్యులు వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్ల కిందట సంఘాన్ని రద్దు చేసుకోవడంతో దానికి నకిలీ డాక్యుమెంట్‌తో రూ.8,57,787 రుణం మంజూరు చేశారన్నారు.

పొదుపులో దాచుకున్న సొమ్ము స్వాహా..

ఇప్పటివరకు 116 సంఘాల వివరాలు పరిశీలించగా రూ.1.70 కోట్లు స్వాహా చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. వెలుగు కార్యాలయంలో ఆడిట్‌ అధికారులకు నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్లను ఇచ్చి పక్కదోవ పట్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంకులో జరిగిన నగదు లావాదేవీల నివేదికలను మార్చడంతో మోసాన్ని గుర్తించలేకపోయినట్లు వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త రూతు తెలిపారు. పొదుపులో దాచుకున్న తమ సొమ్మును స్వాహా చేశారని డ్వాక్రా మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇదీ చూడండి: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన అక్రమాలపై విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి, వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త రూతు, ఏపీఎం సుబ్రహ్మణ్యం, సీసీలతో కలిసి బ్యాంకులో శనివారం దర్యాప్తు చేశారు. బ్యాంకు మెసెంజరు అలీఖాన్‌ వారికి పలు విషయాలు వెల్లడించారు. ప్రధానంగా శివలీల, ఓంశక్తి, చౌడేశ్వరి, గౌసియా, గణపతి, అలమతర, మక్కా ఎస్‌హెచ్‌జీ సంఘాలకు చెందిన రూ.76 లక్షల రుణాల సొమ్ముకు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసినట్లు అంగీకరించాడు.

భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా.. అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా..

ఈ నగదును బ్యాంకు సిబ్బందితో వాటాలు పంచుకున్నట్లు తెలిపారు. కాజేసిన నగదును ఏం చేశావని ప్రశ్నించగా... ‘ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకున్నా. భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా’ అని అతను వెల్లడించినట్లు సీఐ వివరించారు. ఐదారేళ్లుగా బ్యాంకు మేనేజరు కనుసన్నల్లోనే వ్యవహారం జరిగిందని, సబ్‌ మేనేజరు, క్లర్కులు, సిబ్బంది వాటాలు పంచుకున్నట్లు గుర్తించామన్నారు. మేడికుర్తికి చెందిన గౌసియా డ్వాక్రా సంఘం సభ్యులు వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్ల కిందట సంఘాన్ని రద్దు చేసుకోవడంతో దానికి నకిలీ డాక్యుమెంట్‌తో రూ.8,57,787 రుణం మంజూరు చేశారన్నారు.

పొదుపులో దాచుకున్న సొమ్ము స్వాహా..

ఇప్పటివరకు 116 సంఘాల వివరాలు పరిశీలించగా రూ.1.70 కోట్లు స్వాహా చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. వెలుగు కార్యాలయంలో ఆడిట్‌ అధికారులకు నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్లను ఇచ్చి పక్కదోవ పట్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంకులో జరిగిన నగదు లావాదేవీల నివేదికలను మార్చడంతో మోసాన్ని గుర్తించలేకపోయినట్లు వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త రూతు తెలిపారు. పొదుపులో దాచుకున్న తమ సొమ్మును స్వాహా చేశారని డ్వాక్రా మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇదీ చూడండి: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.