ETV Bharat / crime

కానిస్టేబుల్​ భార్యపై కోడికత్తితో దాడి.. మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు..

author img

By

Published : Sep 11, 2021, 10:01 AM IST

కానిస్టేబుల్​ భార్య మెడలోంచే ఓ దుండగుడు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఇంటికెళ్లి ఆమెపై దాడి చేసి మరీ దొంగతనానికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.

attack-on-constables-wife-with-a-machete-and-then-chain-theft
కానిస్టేబుల్​ భార్యపై కోడికత్తితో దాడి.. మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు..

కడప జిల్లా చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ కలకలం సృష్టించాడు. ఇంట్లో ఉన్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని.. ఆమెపై కోడికత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కడప జిల్లా కేంద్రంలోని ఎన్జీవో కాలనీకి చెందిన మురళీధ రెడ్డి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన రాత్రి పోలీస్ స్టేషన్​లోనే ఉండిపోయారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. బయట ఉన్న పిల్లలను మీ అమ్మ ఎక్కడుందంటూ అడిగాడు. ఆ పిల్లలు తల్లి స్నానం చేస్తోందని చెప్పారు. అతను అక్కడే ఉండి.. ఆమె బయటకు రాగానే కోడి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె మెడలోంచి గొలుసు లాక్కొని పారిపోయాడు.

పిల్లల ద్వారా విషయం తెసుకున్న స్థానికులు ఆమె భర్తకు, పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పిల్లలను విచారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: GODAVARI FLOODS: ముంచెత్తిన గోదావరి వరద.. జలదిగ్బంధంలోనే విలీన మండలాల ప్రజలు

కడప జిల్లా చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ కలకలం సృష్టించాడు. ఇంట్లో ఉన్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని.. ఆమెపై కోడికత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కడప జిల్లా కేంద్రంలోని ఎన్జీవో కాలనీకి చెందిన మురళీధ రెడ్డి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన రాత్రి పోలీస్ స్టేషన్​లోనే ఉండిపోయారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. బయట ఉన్న పిల్లలను మీ అమ్మ ఎక్కడుందంటూ అడిగాడు. ఆ పిల్లలు తల్లి స్నానం చేస్తోందని చెప్పారు. అతను అక్కడే ఉండి.. ఆమె బయటకు రాగానే కోడి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె మెడలోంచి గొలుసు లాక్కొని పారిపోయాడు.

పిల్లల ద్వారా విషయం తెసుకున్న స్థానికులు ఆమె భర్తకు, పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పిల్లలను విచారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: GODAVARI FLOODS: ముంచెత్తిన గోదావరి వరద.. జలదిగ్బంధంలోనే విలీన మండలాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.