ETV Bharat / crime

Murder: గొడ్డలితో దారుణంగా నరికేశారు..!

author img

By

Published : Aug 17, 2021, 3:23 AM IST

Updated : Aug 17, 2021, 6:33 AM IST

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Murder
Murder

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో 21 ఏళ్ల యువకుడు సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తువ్వపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లికి చెందిన గిరిబాబు అలియాస్ రవి అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి మదనపల్లిలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు రెడ్డివారిపల్లెలోని అవ్వ, తాతల దగ్గరకు వచ్చి వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఊరికి సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై బాలకృష్ణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో 21 ఏళ్ల యువకుడు సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తువ్వపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లికి చెందిన గిరిబాబు అలియాస్ రవి అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి మదనపల్లిలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు రెడ్డివారిపల్లెలోని అవ్వ, తాతల దగ్గరకు వచ్చి వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఊరికి సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై బాలకృష్ణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కిరాతకంగా నరికి.. రెండు భాగాలు చేసి కేఈబీ కెనాల్​లో విసిరేశారు..

Last Updated : Aug 17, 2021, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.