విశాఖలో 57వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. జూనియర్ విభాగంలో మూడు కేటగిరీల్లో జరుగుతున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది స్కేటర్లు పాల్గొన్నారు. రోడ్డు, రింగ్ క్యాడ్, ఇన్లైన్ వంటి విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను ఏసియన్ గేమ్స్ కు ఎంపిక చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి-విశాఖలో ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు