ETV Bharat / city

వర్షం కురిసింది... ఆనందం వెల్లివిరిసింది

రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపిస్తున్న వానలు కాస్త కరుణించాయి. చాలా ప్రాంతాల్లో జోరు వర్షాలు కురిశాయి. గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. చేలకు పదును కోసం ఎదురుచూస్తున్న రైతులు...ఈ వానలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Aug 18, 2019, 11:37 PM IST

rains_in_andhrapradesh
కురిసింది వర్షం..అన్నదాత కళ్లల్లో ఆనందం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షపునీరు అధికంగా చేరటంతో... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. గుంటూరు జిల్లా బాపట్లలో కురిసిన వర్షానికి... కాలువలు నిండి మురుగునీరు రహదారులపై నిలిచిపోయింది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వానలు కురియటంతో....నాట్లు వేసేందుకు అవకాశం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో రెండురోజులుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామునే మొదలైన వాన... అంతరాయం లేకుండా కురుస్తోంది. వారాంతం కావటంతో...తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎడతెరపిలేని వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

వానల రాకకోసం ప్రత్యేక పూజలు చేస్తూ...వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వాసులకు వానరాక సంతోషాన్నిచ్చింది. కల్యాణదుర్గంలో మోస్తరు వర్షం కురవటంతో... రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షంతో ఉపశమనం కలిగిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి...రహదారులు నీటమునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావటంతో...వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మన్యం, మెట్ట, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రాజమహేంద్రవరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లింది. రైల్వే లోబ్రిడ్జి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు బస్సులు దిగి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

కురిసింది వర్షం..అన్నదాత కళ్లల్లో ఆనందం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షపునీరు అధికంగా చేరటంతో... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. గుంటూరు జిల్లా బాపట్లలో కురిసిన వర్షానికి... కాలువలు నిండి మురుగునీరు రహదారులపై నిలిచిపోయింది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వానలు కురియటంతో....నాట్లు వేసేందుకు అవకాశం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో రెండురోజులుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామునే మొదలైన వాన... అంతరాయం లేకుండా కురుస్తోంది. వారాంతం కావటంతో...తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎడతెరపిలేని వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

వానల రాకకోసం ప్రత్యేక పూజలు చేస్తూ...వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వాసులకు వానరాక సంతోషాన్నిచ్చింది. కల్యాణదుర్గంలో మోస్తరు వర్షం కురవటంతో... రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షంతో ఉపశమనం కలిగిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి...రహదారులు నీటమునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావటంతో...వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మన్యం, మెట్ట, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రాజమహేంద్రవరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లింది. రైల్వే లోబ్రిడ్జి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు బస్సులు దిగి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

Intro:వరద బాధితులను ఆదుకోవాలి అని పవన్ పిలుపు మేరకు...2000 మనది కి నిత్యవసర వస్తువులు పంపిణీBody:జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జనసేన కోఆర్డినేటర్ patamsetti సూర్యచంద్ర 2000 మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.. దేవిపట్నం లో వరదలకు నష్టపోయిన గ్రామస్తులు కు బియ్యం ఇతర నిత్యావసర సరుకులు రెండు వాహనాలు లో సూర్యచంద్ర తీసుకెళ్లారు...గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన బాధితులకు సహాయం చేయాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.... శ్రీనివాస్ ప్రత్తిపాడు 617....ap1002Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.