ETV Bharat / city

రూ.92 కోట్లతో రుషికొండ రిసార్టుల పునర్నిర్మాణం: మంత్రి అవంతి

విశాఖలోని రుషికొండ రిసార్టులను ఆధునికత ఉట్టిపడేలా పునర్నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం రూ.92 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Mar 23, 2021, 6:47 PM IST

మంత్రి అవంతి
మంత్రి అవంతి

విశాఖలోని రుషికొండ రిసార్టులను ఆధునికత ఉట్టిపడేలా పునర్నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 92 కోట్లతో రిసార్టులను పునర్నిర్మిస్తున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

క్రీడలు, ఎన్​సీసీ నిధుల అంచనాలపై చర్చించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా కడప జిల్లాలోని ఓ పాఠశాలలో క్రీడ పరికరాలు, శిక్షణ కోసం 3.18 కోట్లు వెచ్చించనున్నట్టు మంత్రి చెప్పారు.

విశాఖలోని రుషికొండ రిసార్టులను ఆధునికత ఉట్టిపడేలా పునర్నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 92 కోట్లతో రిసార్టులను పునర్నిర్మిస్తున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

క్రీడలు, ఎన్​సీసీ నిధుల అంచనాలపై చర్చించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా కడప జిల్లాలోని ఓ పాఠశాలలో క్రీడ పరికరాలు, శిక్షణ కోసం 3.18 కోట్లు వెచ్చించనున్నట్టు మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి:

హైకోర్టు నోటీసులకు సమాధానమిస్తా: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.