ETV Bharat / city

తెలుగు భాషా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి అవంతి

author img

By

Published : Aug 29, 2020, 3:17 PM IST

తెలుగు భాషా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.

Telugu Language Day 2020
Telugu Language Day 2020

తెలుగు భాషా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. బతుకుదెరువు కోసం ఆంగ్ల విద్య నేర్చుకున్నప్పటికీ... జీవిత అనుభూతులతో పాటు సంస్కృతిని తెలియచెప్పేది మాతృభాష అని తెలిపారు. వైఎస్​ జగన్ సీఎం కాగానే అధికార భాషా సంఘం ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్​ కుమార్తెను రాష్ట్ర సాంస్కృతిక సంస్థకు ఛైర్మన్​ చేశారని గుర్తు చేశారు.

తెలుగు భాషా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. బతుకుదెరువు కోసం ఆంగ్ల విద్య నేర్చుకున్నప్పటికీ... జీవిత అనుభూతులతో పాటు సంస్కృతిని తెలియచెప్పేది మాతృభాష అని తెలిపారు. వైఎస్​ జగన్ సీఎం కాగానే అధికార భాషా సంఘం ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్​ కుమార్తెను రాష్ట్ర సాంస్కృతిక సంస్థకు ఛైర్మన్​ చేశారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి

విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.