ETV Bharat / city

'విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు'

author img

By

Published : Jan 10, 2020, 11:02 PM IST

Updated : Jan 10, 2020, 11:14 PM IST

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, వైజాగ్‌ స్టీల్‌)తో విశాఖలో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం పోస్కో సన్నాహాలు చేస్తోంది. దీనిపై వామపక్షాలు, కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నిర్ణయం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్న నినాదానికి తూట్లు పడేలా ఉందని వామపక్షాలు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలకు అవసరమైన ఇనుము ఉత్పత్తి పేరుతో ఉత్తర కొరియా సంస్థకు కారు చౌకగా వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారని కార్మికులు ఉద్యమ బాట పడుతున్నారు.

left parties opposing central government decision on vizag steel plant
left parties opposing central government decision on vizag steel plant
'విశాఖను ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు'
ఎందరో ప్రాణ త్యాగాలతో విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పడింది. అటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం నడుం బిగించిందని వామపక్షాలు అందోళనలు చేస్తున్నాయి. పదహారు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే... నేడు ఏడు మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే స్థాయికి మాత్రమే చేరిందని వారు అంటున్నారు. ఇప్పుడు వాహన రంగానికి కావలిసిన ఇనుము ఉత్పత్తి కోసం దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థను ప్రోత్సహిస్తే క్రమక్రమేనా విశాఖ ఉక్కు... పూర్తిగా ప్రైవేట్ పరం అవుతుందని చెప్తున్నారు.

విశాఖ ఉక్కు వద్ద సుమారు రెండు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు. వీటిలో పోస్కో సంస్థకు 45 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న విశాఖ ఉక్కులో ప్రైవేట్ సంస్థల చొరబాటు ఎప్పటికైనా కర్మాగార ఉనికికి ముప్పు తెస్తుందని కార్మిక నాయకులు అందోళన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఎప్పుడు లాభాల బాటలోనే ఉంది. విశాఖ ఇనుము నాణ్యతలో ప్రపంచ స్థాయి విపణిలో సైతం అగ్రగామిగా నిలిచే ఉంది. గతంలో ఇదే తరహాలో విశాఖ ఉక్కు విస్తరణ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచన చేస్తే కార్మికలోకం సంఘటితం కావటంతో నిలిచింది. మళ్లీ ఇప్పుడు అదే తరహా పరిస్థితి పునరావృతమవుతుందని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు.

ఇవీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...!

'విశాఖ స్టీల్ ప్లాంట్​ను కాపాడుకుంటాం.. పోస్కోను రానివ్వం'

'విశాఖను ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు'
ఎందరో ప్రాణ త్యాగాలతో విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పడింది. అటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం నడుం బిగించిందని వామపక్షాలు అందోళనలు చేస్తున్నాయి. పదహారు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే... నేడు ఏడు మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే స్థాయికి మాత్రమే చేరిందని వారు అంటున్నారు. ఇప్పుడు వాహన రంగానికి కావలిసిన ఇనుము ఉత్పత్తి కోసం దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థను ప్రోత్సహిస్తే క్రమక్రమేనా విశాఖ ఉక్కు... పూర్తిగా ప్రైవేట్ పరం అవుతుందని చెప్తున్నారు.

విశాఖ ఉక్కు వద్ద సుమారు రెండు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు. వీటిలో పోస్కో సంస్థకు 45 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న విశాఖ ఉక్కులో ప్రైవేట్ సంస్థల చొరబాటు ఎప్పటికైనా కర్మాగార ఉనికికి ముప్పు తెస్తుందని కార్మిక నాయకులు అందోళన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఎప్పుడు లాభాల బాటలోనే ఉంది. విశాఖ ఇనుము నాణ్యతలో ప్రపంచ స్థాయి విపణిలో సైతం అగ్రగామిగా నిలిచే ఉంది. గతంలో ఇదే తరహాలో విశాఖ ఉక్కు విస్తరణ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచన చేస్తే కార్మికలోకం సంఘటితం కావటంతో నిలిచింది. మళ్లీ ఇప్పుడు అదే తరహా పరిస్థితి పునరావృతమవుతుందని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు.

ఇవీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...!

'విశాఖ స్టీల్ ప్లాంట్​ను కాపాడుకుంటాం.. పోస్కోను రానివ్వం'

sample description
Last Updated : Jan 10, 2020, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.