ETV Bharat / city

విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమ‌తిపై అయోమయం!

author img

By

Published : Sep 22, 2020, 10:43 AM IST

Updated : Sep 22, 2020, 12:10 PM IST

విశాఖకు అమోనియం నైట్రేట్ దిగుమ‌తులపై.. సందిగ్ధత వీడ‌డం లేదు. ఇప్పటికే సాగర తీరంలో అన్‌లోడింగ్ కోసం.. 2 నౌక‌లు లంగ‌రు వేసుకుని కూర్చున్నాయి. మరొకటి త్వరలో రానుంది. అమోనియం నైట్రేట్ దిగుమ‌తి, నిల్వ చేసే సంస్థ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నతో ఎన్​ఓసీ ర‌ద్దయింది. ఈ క్రమంలో.. గోదాముల్లో కాకుండా నేరుగా ప‌రిశ్రమ‌లకే పంపడంపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

Imports of ammonium nitrate
Imports of ammonium nitrate

కొన్ని నెలల కిందట.. బీరుట్‌లో అమోనియం నైట్రేట్ సృష్టించిన బీభత్సంతో.. ఆ రసాయన నిల్వలపై ప్రపంచవ్యాప్తంగా మ‌థనం మొదలైంది. మనదేశంలోనూ.. ఆ రసాయనం దిగుమ‌తులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. భ‌ద్రతా ప్రమాణాల‌ను బేరీజు వేసుకుని.. ఒక్క విశాఖ పోర్టుకు మాత్రమే.. అమోనియం నైట్రేట్‌ దిగుమ‌తికి అనుమతి ఇచ్చారు. నాగ్‌పూర్‌లోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేప్టీ ఆర్గనైజేష‌న్.. కేంద్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి అనుమ‌తి త‌ర్వాతే దిగుమ‌తి, నిల్వ‌, ర‌వాణా జ‌రుగుతుంది. విశాఖ పోలీసులు ఎన్​ఓసీ ఇచ్చాకే.. షిప్పింగ్ కంపెనీల‌కు వెసులుబాటు ఉంటుంది. ఇలా.. ఏటా ల‌క్షల ట‌న్నుల అమోనియం నైట్రేట్‌ దిగుమతి, తరలింపు జరిగేది.

విశాఖ‌లో రెండు ద‌శాబ్దాలుగా.. శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థ అమోనియం నైట్రేట్ దిగుమ‌తి, నిల్వ, పంపిణీ చేస్తోంది. బీరుట్ ఘ‌ట‌న త‌ర్వాత.. త‌నిఖీల్లో అంతా స‌వ్యంగా ఉంద‌ని అధికారులు చెప్పినా.. గోదాములు, నిల్వలు ప్రమాణాల‌కు అనుగుణంగా లేవ‌ని నిపుణులు తేల్చారు. ఫ‌లితంగా.. ఆ సంస్థ గోదాముల్లో ఉన్న 20 వేల ట‌న్నులను తక్షణమే ప‌రిశ్రమ‌లకు తరలించారు. అయితే ఇప్పటికీ సుమారు నాలుగు వేల ట‌న్నుల అమోనియం నైట్రేట్ గోదాముల్లోనే ఉంది. ఈ సమయంలోనే.. శ్రావ‌ణ్ షిప్పింగ్‌ సంస్థకు దిగుమతులు, నిల్వలపై అనుమ‌తులను.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి.. తాత్కాలికంగా నిలిపివేసింది. నిర్ణీత స‌మ‌యంలో స‌మాధానం ఇవ్వనందున పోలీసులు ఎన్​ఏసీ ర‌ద్దు చేశారు.

విశాఖకు ప్రస్తుతం.. ఎరువుల త‌యారీ గ్రేడ్‌కు సంబంధించిన నైట్రేటే ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతోంది. ఇప్పటికి రెండు నౌకలు అన్ ‌లోడింగ్ కోసం వేచిచూస్తుండగా.. వాటిల్లో ఉన్న రసాయనాన్ని ఎంత తర్వగా త‌ర‌లిస్తే.. అంత మంచిద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షిప్పింగ్ సంస్థకు ఎన్​ఓసీ ర‌ద్దుతో.. మరింతకాలం సందిగ్ధత‌ కొన‌సాగనుంది.

కొన్ని నెలల కిందట.. బీరుట్‌లో అమోనియం నైట్రేట్ సృష్టించిన బీభత్సంతో.. ఆ రసాయన నిల్వలపై ప్రపంచవ్యాప్తంగా మ‌థనం మొదలైంది. మనదేశంలోనూ.. ఆ రసాయనం దిగుమ‌తులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. భ‌ద్రతా ప్రమాణాల‌ను బేరీజు వేసుకుని.. ఒక్క విశాఖ పోర్టుకు మాత్రమే.. అమోనియం నైట్రేట్‌ దిగుమ‌తికి అనుమతి ఇచ్చారు. నాగ్‌పూర్‌లోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేప్టీ ఆర్గనైజేష‌న్.. కేంద్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి అనుమ‌తి త‌ర్వాతే దిగుమ‌తి, నిల్వ‌, ర‌వాణా జ‌రుగుతుంది. విశాఖ పోలీసులు ఎన్​ఓసీ ఇచ్చాకే.. షిప్పింగ్ కంపెనీల‌కు వెసులుబాటు ఉంటుంది. ఇలా.. ఏటా ల‌క్షల ట‌న్నుల అమోనియం నైట్రేట్‌ దిగుమతి, తరలింపు జరిగేది.

విశాఖ‌లో రెండు ద‌శాబ్దాలుగా.. శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థ అమోనియం నైట్రేట్ దిగుమ‌తి, నిల్వ, పంపిణీ చేస్తోంది. బీరుట్ ఘ‌ట‌న త‌ర్వాత.. త‌నిఖీల్లో అంతా స‌వ్యంగా ఉంద‌ని అధికారులు చెప్పినా.. గోదాములు, నిల్వలు ప్రమాణాల‌కు అనుగుణంగా లేవ‌ని నిపుణులు తేల్చారు. ఫ‌లితంగా.. ఆ సంస్థ గోదాముల్లో ఉన్న 20 వేల ట‌న్నులను తక్షణమే ప‌రిశ్రమ‌లకు తరలించారు. అయితే ఇప్పటికీ సుమారు నాలుగు వేల ట‌న్నుల అమోనియం నైట్రేట్ గోదాముల్లోనే ఉంది. ఈ సమయంలోనే.. శ్రావ‌ణ్ షిప్పింగ్‌ సంస్థకు దిగుమతులు, నిల్వలపై అనుమ‌తులను.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ‌ మండ‌లి.. తాత్కాలికంగా నిలిపివేసింది. నిర్ణీత స‌మ‌యంలో స‌మాధానం ఇవ్వనందున పోలీసులు ఎన్​ఏసీ ర‌ద్దు చేశారు.

విశాఖకు ప్రస్తుతం.. ఎరువుల త‌యారీ గ్రేడ్‌కు సంబంధించిన నైట్రేటే ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతోంది. ఇప్పటికి రెండు నౌకలు అన్ ‌లోడింగ్ కోసం వేచిచూస్తుండగా.. వాటిల్లో ఉన్న రసాయనాన్ని ఎంత తర్వగా త‌ర‌లిస్తే.. అంత మంచిద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షిప్పింగ్ సంస్థకు ఎన్​ఓసీ ర‌ద్దుతో.. మరింతకాలం సందిగ్ధత‌ కొన‌సాగనుంది.

ఇదీ చదవండం:

భారీ నష్టాల్లో మార్కెట్లు- 38 వేల దిగువకు సెన్సెక్స్

Last Updated : Sep 22, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.