ETV Bharat / city

గాజువాక యువతి హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు

author img

By

Published : Nov 25, 2020, 11:09 AM IST

అక్టోబరు 31న జరిగిన గాజువాక యువతి హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాతగాజువాకకు చెందిన యువకుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.

Filed a chargesheet in the murder of a young woman as a gajuwaka
గాజువాక యువతి హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు

విశాఖలోని గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన యువతిని గొంతుకోసి హత్య చేసిన కేసులో దిశ పోలీసులు సోమవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. పాతగాజువాక చట్టివానిపాలెం ప్రాంతానికి చెందిన అఖిల్‌సాయి ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ కేసును దిశ పోలీసులు సవాలుగా తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు చేశారు.

అక్టోబరు 31న సంఘటన జరిగితే... ఇప్పటివరకు కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఛార్జిషీట్ నమోదు చేయలేదు. ఛార్జిషీటు దాఖలు దృష్ట్యా కేసుల విచారణ మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. నిందితుడు.. ప్రస్తుతం రిమాండ్ కింద కేంద్ర కారాగారంలో ఉన్నాడు.

విశాఖలోని గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన యువతిని గొంతుకోసి హత్య చేసిన కేసులో దిశ పోలీసులు సోమవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. పాతగాజువాక చట్టివానిపాలెం ప్రాంతానికి చెందిన అఖిల్‌సాయి ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ కేసును దిశ పోలీసులు సవాలుగా తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు చేశారు.

అక్టోబరు 31న సంఘటన జరిగితే... ఇప్పటివరకు కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఛార్జిషీట్ నమోదు చేయలేదు. ఛార్జిషీటు దాఖలు దృష్ట్యా కేసుల విచారణ మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. నిందితుడు.. ప్రస్తుతం రిమాండ్ కింద కేంద్ర కారాగారంలో ఉన్నాడు.

ఇదీ చదవండి:

తమిళనాడులో హత్యచేశారు.. రామాపురంలో చిక్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.