ETV Bharat / city

విశాఖలో మాస్క్​ ధరించని 50 వేల మందికి జరిమానా

విశాఖ పట్టణంలో మాస్క్ ధరించని 50 వేల మందికి జరిమానా విధించినట్లు నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. మాస్కుల ధారణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

author img

By

Published : Apr 12, 2021, 10:11 AM IST

visakha police commissioner
విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా

మాస్క్​ ధరించని వారికి.. జరిమానా విధించడం ద్వారా వారి బాధ్యతను సైతం గుర్తుచేసినట్టుగా అవుతుందని విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. విశాఖకు వచ్చి తిరిగి వెళ్తున్న జనాలకు మాస్కుల ధారణపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.

రెండు వారాలుగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది మాస్క్ ధరించని వారికి జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. 99 శాతం మంది మాస్క్ ధరించి బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని ఆయన తెలిపారు.

మాస్క్​ ధరించని వారికి.. జరిమానా విధించడం ద్వారా వారి బాధ్యతను సైతం గుర్తుచేసినట్టుగా అవుతుందని విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. విశాఖకు వచ్చి తిరిగి వెళ్తున్న జనాలకు మాస్కుల ధారణపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.

రెండు వారాలుగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది మాస్క్ ధరించని వారికి జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. 99 శాతం మంది మాస్క్ ధరించి బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

సరుగుడు తోటలో అగ్నిప్రమాదం.. 30 ఎకరాల్లో పంట నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.