ETV Bharat / city

విశాఖలో బీచ్‌ రిసార్టు కూల్చివేత

author img

By

Published : Aug 7, 2021, 8:30 AM IST

విశాఖపట్నం సముద్రతీరంలో రుషికొండ వద్ద పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన బీచ్‌ రిసార్టు భవనాల కూల్చివేత పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు కాటేజీలను శుక్రవారానికి పూర్తిగా నేలమట్టం చేశారు.

Demolition of a beach
Demolition of a beach

విశాఖపట్నం సముద్రతీరంలో రుషికొండ వద్ద పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బీచ్‌ రిసార్టు భవనాల కూల్చివేత పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు కాటేజీలను శుక్రవారానికి పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక్కడ రుషికొండ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం 14 ఏళ్ల క్రితమే నిర్మించిన భవనాలను కూల్చడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ బీచ్‌ రిసార్టుపై ఇప్పటివరకు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయగా దాన్ని తొలగించి మరో కొత్త ప్రాజెక్టుకు రూ.91 కోట్లు ఖర్చు చేయనున్నారు.

రుషికొండ బీచ్‌ రిసార్టులో 22 గదులను రూ.2 కోట్లతో గత ఏడాదే ఆధునికీకరించారు. ఇందుకు గుత్తేదారుకు ఇంకా రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు సంవత్సరంలో రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ మందిరాన్ని రూ.కోటితో అభివృద్ధి చేశారు. హుద్‌హుద్‌ సమయంలో పనులకు కోట్ల రూపాయలు వెచ్చించారు. నూతన బ్లాక్‌ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు దీనిపై రూ.8 కోట్ల వరకు వెచ్చించారు. అంతకుముందు దీన్ని రూ.3 కోట్లతో నిర్మించారు.

* ప్రస్తుతం కూల్చుతున్న రుషికొండ బీచ్‌ రిసార్టులో 60 గదులతో భవన సముదాయాలు, సమావేశ మందిరం, రెస్టారెంట్‌ ఉన్నాయి. ఈ రిసార్టు ఏటా రూ.30 కోట్ల టర్నోవర్‌ సాధిస్తుంది.

* కొత్త ప్రాజెక్టులో మొదటిదశ పనులు రూ.91 కోట్లతో చేపట్టనుండగా డీఈసీ సంస్థ వీటిని దక్కించుకుంది. 15 నెలల్లోగా ఈ పనులు పూర్తిచేసి అప్పగించాలనే నిబంధన పెట్టారు. స్థలాన్ని అభివృద్ధి చేయడానికే రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

ఇదీ చదవండి: pulichintala: పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

విశాఖపట్నం సముద్రతీరంలో రుషికొండ వద్ద పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బీచ్‌ రిసార్టు భవనాల కూల్చివేత పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు కాటేజీలను శుక్రవారానికి పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక్కడ రుషికొండ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం 14 ఏళ్ల క్రితమే నిర్మించిన భవనాలను కూల్చడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ బీచ్‌ రిసార్టుపై ఇప్పటివరకు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయగా దాన్ని తొలగించి మరో కొత్త ప్రాజెక్టుకు రూ.91 కోట్లు ఖర్చు చేయనున్నారు.

రుషికొండ బీచ్‌ రిసార్టులో 22 గదులను రూ.2 కోట్లతో గత ఏడాదే ఆధునికీకరించారు. ఇందుకు గుత్తేదారుకు ఇంకా రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు సంవత్సరంలో రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ మందిరాన్ని రూ.కోటితో అభివృద్ధి చేశారు. హుద్‌హుద్‌ సమయంలో పనులకు కోట్ల రూపాయలు వెచ్చించారు. నూతన బ్లాక్‌ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు దీనిపై రూ.8 కోట్ల వరకు వెచ్చించారు. అంతకుముందు దీన్ని రూ.3 కోట్లతో నిర్మించారు.

* ప్రస్తుతం కూల్చుతున్న రుషికొండ బీచ్‌ రిసార్టులో 60 గదులతో భవన సముదాయాలు, సమావేశ మందిరం, రెస్టారెంట్‌ ఉన్నాయి. ఈ రిసార్టు ఏటా రూ.30 కోట్ల టర్నోవర్‌ సాధిస్తుంది.

* కొత్త ప్రాజెక్టులో మొదటిదశ పనులు రూ.91 కోట్లతో చేపట్టనుండగా డీఈసీ సంస్థ వీటిని దక్కించుకుంది. 15 నెలల్లోగా ఈ పనులు పూర్తిచేసి అప్పగించాలనే నిబంధన పెట్టారు. స్థలాన్ని అభివృద్ధి చేయడానికే రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

ఇదీ చదవండి: pulichintala: పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.