ETV Bharat / city

ఏపీడీఆర్​పీ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: సీఎస్

author img

By

Published : Mar 23, 2021, 8:40 PM IST

ఏపీ విపత్తు నిర్వహణ రికవరీ ప్రాజెక్టు కింద నాలుగు తీర ప్రాంత జిల్లాల్లో 1,777 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

CS Review On APDRP Project Works
ఏపీడీఆర్​పీ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష

రాష్ట్ర విపత్తు నిర్వహణ రికవరీ ప్రాజెక్టు కింద 4 తీర ప్రాంత జిల్లాల్లో 1,777 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించారు. ఏపీడీఆర్పీ కింద చేపట్టిన పనుల్ని ఈ నెలాఖరుకే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ... కొవిడ్ కారణంగా ఆలస్యమైనట్టు అధికారులు సీఎస్​కు వివరించారు.

మార్చి 10వ తేదీ నాటికి ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనుల్లో 1,382 కోట్ల మేర పనుల్ని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా... విశాఖ నగరంలో ఏపీఈపీడీసీఎల్ భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంలో 50 శాతం మేర పనులు పూర్తైనట్టు సీఎస్ స్పష్టం చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా... 4 జిల్లాల్లో 291 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 528 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 178 కోట్లతో బీచ్ షోర్ డెవలప్మెంట్ పనుల్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ రికవరీ ప్రాజెక్టు కింద 4 తీర ప్రాంత జిల్లాల్లో 1,777 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించారు. ఏపీడీఆర్పీ కింద చేపట్టిన పనుల్ని ఈ నెలాఖరుకే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ... కొవిడ్ కారణంగా ఆలస్యమైనట్టు అధికారులు సీఎస్​కు వివరించారు.

మార్చి 10వ తేదీ నాటికి ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనుల్లో 1,382 కోట్ల మేర పనుల్ని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా... విశాఖ నగరంలో ఏపీఈపీడీసీఎల్ భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంలో 50 శాతం మేర పనులు పూర్తైనట్టు సీఎస్ స్పష్టం చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా... 4 జిల్లాల్లో 291 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 528 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 178 కోట్లతో బీచ్ షోర్ డెవలప్మెంట్ పనుల్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి:

'యువ శక్తికి, దేశ భక్తికి నిర్వచనంగా మారిన ధన్య జీవులు వారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.