ETV Bharat / city

గాజువాక ఘటనపై సీఎం ఆరా... రూ.10 లక్షలు సాయం చేయాలని ఆదేశం

author img

By

Published : Nov 1, 2020, 12:06 PM IST

Updated : Nov 1, 2020, 3:45 PM IST

విశాఖలో ప్రేమోన్మాదానికి బలైన యువతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్‌ సూచించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

cm-jagan-suggested
cm-jagan-suggested

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది ఉన్మాదానికి బలైన యువతి ఘటనను సీరియస్​గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం.... యువతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

యువతి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌కు సూచించారు. ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు... ప్రతి మహిళ వరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు నుంచి కళాశాల విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించవద్దని, ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది ఉన్మాదానికి బలైన యువతి ఘటనను సీరియస్​గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం.... యువతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

యువతి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌కు సూచించారు. ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు... ప్రతి మహిళ వరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు నుంచి కళాశాల విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించవద్దని, ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

విశాఖలో దారుణం...ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

Last Updated : Nov 1, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.