ETV Bharat / city

ప్రలోభాలకు లోనై.. పార్టీకి ద్రోహం: చంద్రబాబు

author img

By

Published : Sep 19, 2020, 9:31 PM IST

వ్యక్తిగత స్వార్థంతో కొందరు నేతలు పార్టీకి ద్రోహం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వాసుపల్లి గణేష్ వైకాపా పంచన చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లోనైన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లోంచి తెదేపాను చెరపలేదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం.. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు
చంద్రబాబు

ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమైన చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​ సీఎం జగన్​ను కలవడంపై చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు తెదేపా వెన్నంటే ఉన్నారని, స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదన్నారు. నాయకులు వస్తారు.. పోతారని, పార్టీ, కార్యకర్తలు శాశ్వతమన్నారు. కార్యకర్తల అభిమానం, ప్రజాదరణ తెలుగుదేశం సొంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలేనని, జెండా పంచన చేరిన నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతీ స్కీములో స్కాములే

ద్రోహులకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదన్న చంద్రబాబు.... ప్రజల గుండెల్లోంచి తెదేపాను ఎవరూ తొలగించలేరని తేల్చి చెప్పారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధే అన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నారు. హుద్ హుద్​లో తెదేపా కష్టాన్ని ప్రజలు మరిచిపోరని, తెదేపా ఐదేళ్ల పాలనలో విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు తెచ్చి, లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అందుకే విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలు తెదేపా గెలిచిందని గుర్తు చేశారు. వైకాపా వచ్చాక అన్నింటినీ నాశనం చేస్తోందని, వేలాది ఎకరాల భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో వైకాపా దందాలు చేస్తుందని, ఇళ్ల స్థలాల ముసుగులో ల్యాండ్ స్కామ్​లు, లెవలింగ్ పేరుతో వేల కోట్లు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి స్కీమ్​లో స్కామ్​లకు పాల్పడుతున్నారని విమర్శించారు.

దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపులు

మొదట తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేశారని, తర్వాత బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు దళితులపై దమనకాండకు దిగారని, చివరికి దేవాలయాలపై దాడులకు కూడా తెగబడ్డారని ఆక్షేపించారు. ప్రతి జిల్లాలో వైకాపా శాండ్-ల్యాండ్, మైన్-వైన్ మాఫియా మూకలు పేట్రేగి పోయాయని, ప్రజల్లో వైకాపా పట్ల అసహ్యం పెరిగిందని చంద్రబాబు అన్నారు. వైకాపా దుర్మార్గాలపై ప్రజలే తిరుగుబాటు చేస్తారన్నారు. వైకాపా అవినీతి-అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపులకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రలోభాలకు కొందరు లొంగిపోయి పార్టీకి ద్రోహం చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. నీతి నిజాయితీ, చిత్తశుద్ధి లేని పార్టీ వైకాపా అని, వైకాపా మైండ్ గేమ్​ను, కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'

ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమైన చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​ సీఎం జగన్​ను కలవడంపై చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు తెదేపా వెన్నంటే ఉన్నారని, స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదన్నారు. నాయకులు వస్తారు.. పోతారని, పార్టీ, కార్యకర్తలు శాశ్వతమన్నారు. కార్యకర్తల అభిమానం, ప్రజాదరణ తెలుగుదేశం సొంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలేనని, జెండా పంచన చేరిన నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతీ స్కీములో స్కాములే

ద్రోహులకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదన్న చంద్రబాబు.... ప్రజల గుండెల్లోంచి తెదేపాను ఎవరూ తొలగించలేరని తేల్చి చెప్పారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధే అన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నారు. హుద్ హుద్​లో తెదేపా కష్టాన్ని ప్రజలు మరిచిపోరని, తెదేపా ఐదేళ్ల పాలనలో విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు తెచ్చి, లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అందుకే విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలు తెదేపా గెలిచిందని గుర్తు చేశారు. వైకాపా వచ్చాక అన్నింటినీ నాశనం చేస్తోందని, వేలాది ఎకరాల భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో వైకాపా దందాలు చేస్తుందని, ఇళ్ల స్థలాల ముసుగులో ల్యాండ్ స్కామ్​లు, లెవలింగ్ పేరుతో వేల కోట్లు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి స్కీమ్​లో స్కామ్​లకు పాల్పడుతున్నారని విమర్శించారు.

దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపులు

మొదట తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేశారని, తర్వాత బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు దళితులపై దమనకాండకు దిగారని, చివరికి దేవాలయాలపై దాడులకు కూడా తెగబడ్డారని ఆక్షేపించారు. ప్రతి జిల్లాలో వైకాపా శాండ్-ల్యాండ్, మైన్-వైన్ మాఫియా మూకలు పేట్రేగి పోయాయని, ప్రజల్లో వైకాపా పట్ల అసహ్యం పెరిగిందని చంద్రబాబు అన్నారు. వైకాపా దుర్మార్గాలపై ప్రజలే తిరుగుబాటు చేస్తారన్నారు. వైకాపా అవినీతి-అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపులకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రలోభాలకు కొందరు లొంగిపోయి పార్టీకి ద్రోహం చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. నీతి నిజాయితీ, చిత్తశుద్ధి లేని పార్టీ వైకాపా అని, వైకాపా మైండ్ గేమ్​ను, కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.