ETV Bharat / city

'కేంద్రం నిధులిచ్చినా...కరోనా పోరాట యోధులకు జీతాలు ఇవ్వడం లేదు'

author img

By

Published : Nov 11, 2020, 3:18 PM IST

కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు ప్రభుత్వం చెల్లించడం లేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కేంద్రం నుంచి కరోనాపై పోరుకు రూ.8 కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కేంద్రం నిధులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు జీతాలివ్వడం లేదని ఆయన విమర్శించారు.

vishnu kumar raju
vishnu kumar raju

కరోనాపై పోరాటానికి కేంద్రం...ఏపీకి రూ.8 వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే కనీసం కొవిడ్ పోరాట యోధులకు వైకాపా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా కట్టడి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.

వైద్యులు, హౌస్ సర్జన్​లు, వైద్య సిబ్బందికి జీతాలు జాప్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి...కరోనా పోరాట యోధులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కరోనాపై పోరాటానికి కేంద్రం...ఏపీకి రూ.8 వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే కనీసం కొవిడ్ పోరాట యోధులకు వైకాపా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా కట్టడి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.

వైద్యులు, హౌస్ సర్జన్​లు, వైద్య సిబ్బందికి జీతాలు జాప్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి...కరోనా పోరాట యోధులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇస్తే.... ఇలాంటి ఘటనలే జరుగుతాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.