ETV Bharat / city

'అనిశా వలలో మరో అవినీతి చేప'

రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ వరప్రసాద్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ..అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.

author img

By

Published : Mar 27, 2019, 8:29 PM IST

అనిశాకు చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్ వరప్రసాద్
అనిశాకు చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్ వరప్రసాద్
20 వేలు లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) అసిస్టెంట్ ఇంజనీర్ వరప్రసాద్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. విశాఖ జిల్లాలోని పాడేరు, తదితర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు... కాంట్రాక్టర్ సత్యనారాయణ వద్ద నుంచి ఏఈ వరప్రసాద్ 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ సత్యనారాయణ అనిశా అధికారులను కలిశారు. పక్కా వ్యూహం ప్రకారం.. ఇవాళ విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం వద్ద ఉన్న ఏపీఎస్ఐడీసీ కార్యాలయంలో ఏఈ ప్రసాద్ లంచం తీసుకుంటుండగా..అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు.. అనిశా డీఎస్పీ రంగరాజు తెలిపారు.

ఇవి చూడండి...

ఈసీ పరిధిలోకి పోలీసు యంత్రాంగం...

అనిశాకు చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్ వరప్రసాద్
20 వేలు లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) అసిస్టెంట్ ఇంజనీర్ వరప్రసాద్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. విశాఖ జిల్లాలోని పాడేరు, తదితర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు... కాంట్రాక్టర్ సత్యనారాయణ వద్ద నుంచి ఏఈ వరప్రసాద్ 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ సత్యనారాయణ అనిశా అధికారులను కలిశారు. పక్కా వ్యూహం ప్రకారం.. ఇవాళ విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం వద్ద ఉన్న ఏపీఎస్ఐడీసీ కార్యాలయంలో ఏఈ ప్రసాద్ లంచం తీసుకుంటుండగా..అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు.. అనిశా డీఎస్పీ రంగరాజు తెలిపారు.

ఇవి చూడండి...

ఈసీ పరిధిలోకి పోలీసు యంత్రాంగం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.