లెఫ్టినెంట్ కమాండర్ అభినవ్ జా.. చండీగఢ్లో నిర్వహించిన 'టఫ్మ్యాన్ 100 కిలోమీటర్ల స్టేడియం రన్' లో గెలుపొందారు. విశాఖ తూర్పు నౌకాదళంలోని ఐఎన్ఎస్ కర్ణలో ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు. వంద కిలోమీటర్ల పరుగును 8 గంటల 17 నిమిషాల 02 సెకన్ల రికార్డు సమయంలో పూర్తిచేసి భారత గడ్డపై సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ పోటీలో ప్రథమస్థానంలో నిలవడం వలన.. వచ్చే సెప్టెంబర్లో.. నెదర్లాండ్లో జరిగే 100 కిలోమీటర్ల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. గతంలోనూ అభినవ్ జా క్రొయేషియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున పాల్గొని.. 100 కిలోమీటర్లను 08 గంటల 27 నిమిషాల 55 సెకన్లలో పూర్తిచేశారు.
ఇదీ చదవండి : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. థీమ్పై గెలుపు