ETV Bharat / city

'స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం.. సుప్రీంను ఆశ్రయిస్తాం'

author img

By

Published : Jan 10, 2021, 8:49 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారపార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తామని.. ఈ విషయంపై సుప్రీం కోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు.

'ఎన్నికలను బహిష్కరిస్తాం.. సుప్రీంను ఆశ్రయిస్తాం'
'ఎన్నికలను బహిష్కరిస్తాం.. సుప్రీంను ఆశ్రయిస్తాం'

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై హైకోర్టుకు... అక్కడ కాకుంటే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన వైకాపా నవరత్నాల విజయోత్సవ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించక ముందు స్థానిక ఎన్నికలను రద్దు చేసి, ఇప్పుడు రెండో దఫా వైరస్‌ విజృంభిస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం చూస్తుంటే ఓ వ్యక్తికి సహాయం చేయబోయి.. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తున్నట్టుగా ఉందని అన్నారు చెప్పారు. కేవలం చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేందుకే పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 95 శాతం స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవనే తాము చెబుతున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారన్నారు.

ఎన్నికలకు భయపడటం లేదు: ధర్మాన

పంచాయతీ ఎన్నికలు రేపు నిర్వహించినా గెలుపు మాదే. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అధికంగా ఉందని, టీకాలు వేసేందుకు సన్నద్ధమయ్యాం. ఎన్నికలకు భయపడి వద్దని అనడం లేదని, కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎందుకని ఆలోచిస్తున్నాం.

పండగపూట పేదలకు ఆనందం లేకుండా చేస్తున్నారు: బొత్స

ఈ నెల 11న అమ్మఒడి సాయం అందజేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా పండగవేళ పేద ప్రజలకు ఆనందం, సంతోషం లేకుండా చేయటమే ధ్యేయంగా తెదేపా కుయుక్తులు పన్నింది. ఎన్నికల నెపంతో ఇళ్ల స్థలాలు, అమ్మఒడి సాయం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవటానికి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలనుకున్నా చంద్రబాబు, ఆయన తాబేదారులు కొందరు కోర్టులకు వెళ్లి అడ్డుతగిలారు.

ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్‌: విశ్వరూప్‌

పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించడంపై కోర్టుకెళతాం. రాష్ట్రంలో విగ్రహాలపై జరుగుతున్న దాడులు ప్రతిపక్షాల కుట్ర. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్‌కు మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి సంఘటనలు చేయిస్తున్నారు.

చంద్రబాబు ప్రోద్బలంతోనే..: అప్పలరాజు

సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు ప్రోద్బలంతో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పథకాలు అందకుండా చేస్తున్న చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుంది.

ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టాలి: బాలినేని

రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల మధ్యలో ఆగాయి. ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు పెట్టాలనుకుంటే ఆగిపోయిన ఎన్నికల నుంచే ప్రక్రియను ప్రారంభించాలి. అలాకాకుండా పంచాయతీ ఎన్నికలకే కమిషనర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారంటేనే ఒక పార్టీ చెప్పినట్లుగా ఆయన పనిచేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

ఏకపక్ష ధోరణి సాగనివ్వం: మోపిదేవి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ పట్టుబట్టితే మేం మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.

ఉద్యోగులు చనిపోతే బాధ్యత వహిస్తారా?

పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బాధ్యత వహిస్తారా అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కోరుకుంటున్నారే తప్ప పంచాయతీ ఎన్నికలను కాదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాకు డిపాజిట్లు రావని, అందుకే ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన నిలిచిన జగన్‌ను చంద్రబాబు, తెదేపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. వారిని ఈ వర్గాల వారంతా రాష్ట్రం నుంచి తరిమికొడతారన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టతరమని ప్రభుత్వం చెబుతుందే తప్ప ఎన్నికలు ఎప్పుడైనా వైకాపాదే గెలుపని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అమెరికాలో ట్రంప్‌ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశాడో, ఏపీలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ ట్రంప్‌నకు తమ్ముడిలా వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విమర్శించారు.

ఇదీ చదవండి:

ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై హైకోర్టుకు... అక్కడ కాకుంటే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన వైకాపా నవరత్నాల విజయోత్సవ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించక ముందు స్థానిక ఎన్నికలను రద్దు చేసి, ఇప్పుడు రెండో దఫా వైరస్‌ విజృంభిస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం చూస్తుంటే ఓ వ్యక్తికి సహాయం చేయబోయి.. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తున్నట్టుగా ఉందని అన్నారు చెప్పారు. కేవలం చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేందుకే పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 95 శాతం స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవనే తాము చెబుతున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారన్నారు.

ఎన్నికలకు భయపడటం లేదు: ధర్మాన

పంచాయతీ ఎన్నికలు రేపు నిర్వహించినా గెలుపు మాదే. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అధికంగా ఉందని, టీకాలు వేసేందుకు సన్నద్ధమయ్యాం. ఎన్నికలకు భయపడి వద్దని అనడం లేదని, కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎందుకని ఆలోచిస్తున్నాం.

పండగపూట పేదలకు ఆనందం లేకుండా చేస్తున్నారు: బొత్స

ఈ నెల 11న అమ్మఒడి సాయం అందజేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా పండగవేళ పేద ప్రజలకు ఆనందం, సంతోషం లేకుండా చేయటమే ధ్యేయంగా తెదేపా కుయుక్తులు పన్నింది. ఎన్నికల నెపంతో ఇళ్ల స్థలాలు, అమ్మఒడి సాయం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవటానికి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలనుకున్నా చంద్రబాబు, ఆయన తాబేదారులు కొందరు కోర్టులకు వెళ్లి అడ్డుతగిలారు.

ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్‌: విశ్వరూప్‌

పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించడంపై కోర్టుకెళతాం. రాష్ట్రంలో విగ్రహాలపై జరుగుతున్న దాడులు ప్రతిపక్షాల కుట్ర. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం జగన్‌కు మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి సంఘటనలు చేయిస్తున్నారు.

చంద్రబాబు ప్రోద్బలంతోనే..: అప్పలరాజు

సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు ప్రోద్బలంతో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పథకాలు అందకుండా చేస్తున్న చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుంది.

ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టాలి: బాలినేని

రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల మధ్యలో ఆగాయి. ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు పెట్టాలనుకుంటే ఆగిపోయిన ఎన్నికల నుంచే ప్రక్రియను ప్రారంభించాలి. అలాకాకుండా పంచాయతీ ఎన్నికలకే కమిషనర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారంటేనే ఒక పార్టీ చెప్పినట్లుగా ఆయన పనిచేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

ఏకపక్ష ధోరణి సాగనివ్వం: మోపిదేవి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ పట్టుబట్టితే మేం మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.

ఉద్యోగులు చనిపోతే బాధ్యత వహిస్తారా?

పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బాధ్యత వహిస్తారా అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కోరుకుంటున్నారే తప్ప పంచాయతీ ఎన్నికలను కాదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాకు డిపాజిట్లు రావని, అందుకే ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన నిలిచిన జగన్‌ను చంద్రబాబు, తెదేపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. వారిని ఈ వర్గాల వారంతా రాష్ట్రం నుంచి తరిమికొడతారన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టతరమని ప్రభుత్వం చెబుతుందే తప్ప ఎన్నికలు ఎప్పుడైనా వైకాపాదే గెలుపని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అమెరికాలో ట్రంప్‌ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశాడో, ఏపీలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ ట్రంప్‌నకు తమ్ముడిలా వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విమర్శించారు.

ఇదీ చదవండి:

ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.