రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న నీటి ట్యాంక్ను పేలుడు పదార్థంతో కూల్చివేశారు. ఈ సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 43 ఏళ్లుగా గ్రామప్రజలకు తాగు నీరు అందిస్తున్న ఈ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది.
కొత్త ట్యాంక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ.25 లక్షలు మంజూరు చేశారు. మూడేళ్లలో ట్యాంక్ నిర్మాణం పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన ట్యాంక్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున అధికారులు దాన్ని కూల్చివేశారు. ఈ దృశ్యాలను స్థానికులు తమ చరవాణీల్లో బంధించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్