ETV Bharat / city

సందీప్ మృతదేహం తరలింపులో తర్జనభర్జన

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబసభ్యులు కోరగా... పోలీసులు నిరాకరించారు. నేరుగా స్వర్గపురికే మృతదేహాన్ని తరలించారు.

author img

By

Published : Jun 1, 2020, 2:00 PM IST

vijayawada gang war
vijayawada gang war

విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో మరణించిన తోట సందీప్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహం తరలింపులో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతో తర్జనభర్జన నెలకొంది. ఇంటి వద్ద తల్లి కదలలేని పరిస్థితిలో ఉందని, చివరిచూపు కోసం ఇంటికి అనుమతించాల్సిందిగా కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

అయితే వాళ్లున్న ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉందనే కారణంతో నేరుగా స్వర్గపురికే మృతదేహం తరలించారు. దాన్ని చూసేందుకు తరలివస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పరస్పరం దాడి చేసుకున్న రెండు గ్యాంగ్‌ సభ్యుల కోసం 7 పోలీసు బృందాలతో వెతుకులాట కొనసాగుతోంది.

విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో మరణించిన తోట సందీప్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహం తరలింపులో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతో తర్జనభర్జన నెలకొంది. ఇంటి వద్ద తల్లి కదలలేని పరిస్థితిలో ఉందని, చివరిచూపు కోసం ఇంటికి అనుమతించాల్సిందిగా కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

అయితే వాళ్లున్న ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉందనే కారణంతో నేరుగా స్వర్గపురికే మృతదేహం తరలించారు. దాన్ని చూసేందుకు తరలివస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పరస్పరం దాడి చేసుకున్న రెండు గ్యాంగ్‌ సభ్యుల కోసం 7 పోలీసు బృందాలతో వెతుకులాట కొనసాగుతోంది.

ఇదీ చదవండి

విజయవాడలో గ్యాంగ్ వార్..ఏం జరిగిందంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.