ETV Bharat / city

దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి

author img

By

Published : Jul 30, 2020, 5:43 PM IST

విజయవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి సారించింది. దాతల నుంచి సహాయం పొందేందుకు ప్రత్యేక సెల్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దర్శనం క్యూలైన్లలో మార్పులు, శాశ్వత కేశ ఖండనశాల ఏర్పాటుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి
దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి

బెజవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం దాతల నుంచి మరింత సహాయం పొందేందుకు ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఛైర్మన్‌ సోమినాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో... మొత్తం 38 అంశాలపై చర్చించారు. సంప్రదాయ బద్ధంగా ఆలయానికి వచ్చే భక్తులు... రాజగోపుర మార్గం నుంచి లోపలికి ప్రవేశించి... దర్శనం చేసుకునేలా క్యూ లైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.23 కోట్ల వ్యయంతో దుర్గాఘాట్‌లో శాశ్వత కేశఖండనశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఇదీ చూడండి..

బెజవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం దాతల నుంచి మరింత సహాయం పొందేందుకు ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఛైర్మన్‌ సోమినాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో... మొత్తం 38 అంశాలపై చర్చించారు. సంప్రదాయ బద్ధంగా ఆలయానికి వచ్చే భక్తులు... రాజగోపుర మార్గం నుంచి లోపలికి ప్రవేశించి... దర్శనం చేసుకునేలా క్యూ లైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.23 కోట్ల వ్యయంతో దుర్గాఘాట్‌లో శాశ్వత కేశఖండనశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఇదీ చూడండి..

మిషన్ బిల్డ్ ఏపీపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.